CM Jagan - KCR: భారాస అధినేత కేసీఆర్‌కు సీఎం జగన్‌ పరామర్శ

భారాస అధినేత కేసీఆర్‌ (KCR)ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి (YS Jagan) పరామర్శించారు.

Updated : 04 Jan 2024 13:31 IST

హైదరాబాద్: భారాస అధినేత కేసీఆర్‌ (KCR)ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి (YS Jagan) పరామర్శించారు. గురువారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్‌.. 11:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి జగన్‌ వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత నెలలో కేసీఆర్‌ ప్రమాదవశాత్తు జారిపడడంతో ఎడమ తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయిన అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని