మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు: కేసీఆర్
రాష్ట్రంలో వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
వరద ప్రభావంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
ప్రతి ఇంటికీ ఆహారం, దుప్పట్లు అందివ్వాలని ఆదేశం
హైదరాబాద్: రాష్ట్రంలో వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. బాధితులకు అవసరమైన బియ్యం, పప్పు, ఇతర సామగ్రి అందించాలని సూచించారు. భారీ వర్షాలు, వరద ప్రభావంపై సీఎం అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పరంగా జరిగిన నష్టాన్ని అధికారులు సీఎం కేసీఆర్కు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి ఆహారం, 3 దుప్పట్లు వెంటనే అందించాలని కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం రూ.5కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆయన నిర్ణయించారు. మరోవైపు వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 50 మంది మృతిచెందారని.. మృతుల్లో హైదరాబాద్ పరిధిలో 11 మంది ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని.. ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్తగా మంజూరు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థికసాయం అందించాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 7.35లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు సీఎంకు చెప్పారు. వీటి నష్టం విలువ సుమారు రూ.2వేల కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు వివరించారు. హైదరాబాద్లో 1916 తర్వాత ఒకేరోజు ఇంత భారీగా వర్షం నమోదవడం ఇదే ప్రథమం అని.. దీనివల్ల చాలా కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరిందని అధికారులు సీఎంకు తెలిపారు. నగరంలోని మొత్తం 72 ప్రాంతాల్లోని 144 కాలనీల్లో సుమారు 20వేలకు పైగా ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయని, అందులో 35వేల కుటుంబాలు ప్రభావితమైనట్లు అధికారులు వివరించారు. ముఖ్యంగా ఎల్బీనగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు చెప్పారు. నగరంలో 72 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దావత్ కావాలా నాయనా!
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.