Errabelli Dayakar: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇరికించేందుకు కుట్ర: ఎర్రబెల్లి

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

Published : 06 Apr 2024 15:37 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపినా వెళ్తాను గానీ,  పార్టీ మారబోనని అన్నారు. గతంలో రైతుల కోసం పోలీసులతో దెబ్బలు తిని జైలుకు వెళ్లినట్లు గుర్తుచేశారు. హామీలను అమలుచేయాలని అడిగితే కేసులతో భయపెడుతున్నారని విమర్శించారు. భారాసను మళ్లీ తెరాసగా మార్చాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని