Hyderabad News: హైదరాబాద్లో ‘ఆపరేషన్ రోప్’.. కఠిన నిర్ణయాలు తీసుకుంటాం: సీవీ ఆనంద్
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్...
హైదరాబాద్: నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వాహనాల రద్దీని తగ్గించి నగరవాసులకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఎస్హెచ్వోలతో ఇప్పటికే సమీక్ష నిర్వహించినట్టు వెల్లడించారు. ప్రధాన కూడళ్ల వద్ద కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు పరిష్కరించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
‘‘ఆపరేషన్ రోప్(రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్) పేరుతో కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నాం. హైదరాబాద్లో పార్కింగ్, ఫుట్పాత్ ఆక్రమణపై దృష్టి పెడతాం. మల్టీప్లెక్స్లో 60శాతం, మాల్స్లో 60శాతం, కమర్షియల్ బిల్డింగ్స్ 40శాతం, అపార్ట్మెంట్స్లో 30శాతం పార్కింగ్ కచ్చితంగా ఉండాలి. జీహెచ్ఎంసీతో కలిసి ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తాం. అందరితో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఫుట్పాత్ని వదిలేసి రోడ్డుపైకి వచ్చి బిజినెస్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆర్టీసీ బస్సులకు సంబంధించి బస్ బేల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తాం ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ట్రాఫిక్పై దృష్టి పెడతాం. ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించేలా చూస్తాం. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ఉల్లంఘన కేసులు పెట్టారనేది కాకుండా ఎంతమందికి అవగాహన కల్పించామనేదే చూస్తాం. జాయింట్ సీపీ, డీసీపీలు కూడా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏడాదిలోగా అనుకున్న ఫలితాలు సాధిస్తాం. స్టాప్ లైన్ నియంత్రణ అనేది అందరికీ అలవాటు కావాలి.
రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎలాంటి నిర్మాణాలనైనా తొలగిస్తాం..
డయల్ 100కు 70 నుంచి 80శాతం ఫోన్లు ట్రాఫిక్ సమస్యలపై వస్తున్నాయి. ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోను మెయింటెయిన్ చేయాలంటే క్యారేజ్ వే ఫ్రీగా ఉండాలి. అప్పుడే వాహనాల రాకపోకలు సజావుగా సాగుతాయి. కొవిడ్ ఇబ్బందులతో ఎన్ఫోర్స్మెంట్ సీరియస్గా చేయడం లేదు. ఫ్రంట్ సీటు బెల్టుతో పాటు బ్యాక్ సీటు బెల్టు పెట్టుకునేలా త్వరలో అమలు చేయబోతున్నాం సోషల్ మీడియాను అన్ని రకాలుగా వాడుకునేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. స్కూల్, కాలేజీల పరిసర ప్రాంతాల్లో మేనేజ్మెంట్లతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ట్రాఫిక్ సిబ్బందికి 30శాతం అదనంగా అలవెన్స్ ఇస్తోంది. గతంలో ట్రాఫిక్ అంటే వద్దని వెళ్లిపోయేవారు.. కానీ, ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకొని ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలి, ప్రజలు సహకరిస్తేనే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎలాంటి నిర్మాణాలనైనా త్వరలో తొలగించేలా చర్యలు తీసుకుంటాం’’ అని సీవీ ఆనంద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM