దా‘రుణాల’ యాప్లకు దూరంగా ఉండండి
ప్రస్తుత కాలంలో అప్పు పుట్టడం అంత కష్టమైన పనేమీ కాదు. వీజీగా లోన్స్, క్రెడిట్స్ ఇస్తామంటూ ఆన్లైన్లో ద్రవ్య సంస్థలు గాలం వేస్తున్నాయి. తర్వాత లోన్ రికవరీ చేసేటప్పుడు విపరీతమైన చర్యలకు పాల్పడి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్ : ప్రస్తుత కాలంలో అప్పుపుట్టడం అంత కష్టమైన పనేమీ కాదు. వీజీగా లోన్స్, క్రెడిట్స్ ఇస్తామంటూ ఆన్లైన్లో ద్రవ్య సంస్థలు గాలం వేస్తున్నాయి. తర్వాత లోన్ రికవరీ చేసేటప్పుడు విపరీతమైన చర్యలకు పాల్పడి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అందువల్ల సులభ పద్ధతిలో వచ్చే అప్పుల విషయంలో జాగ్రత్తలు అవసరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్లో వీజీలోన్స్ పేరుతో మోసం చేసేందుకు అయిదు వందలకు పైగా ఫ్రాడ్ యాప్లు ఉన్నాయని పేర్కొన్నారు. సులభంగా అప్పు వస్తుందంటే సులభంగా మోసపోయే అవకాశమూ లేకపోలేదు అంటున్నారు. మరి ఇలాంటి వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ?
ప్రస్తుతం ఉన్న కరోనా సమయంలో చాలామంది ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో అలాంటి వారి మొబైల్స్కు లోన్స్ గురించి తరచూ యాడ్లు వస్తున్నాయి. మేసేజ్ రూపంలోనూ లేదా ఏదైనా వెబ్సైట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఇలా రకరకాల రూపంలో ఇవి ఉంటున్నాయి. అయిదు నిమిషాల్లో లేదా పది నిమిషాల్లో అప్పు ఇస్తామని అందులో ఉంటుంది. అయితే ఈ యాడ్లు చాలావరకు చట్టవిరుద్ధంగా పనిచేసే వాటి నుంచి వచ్చేవే ఉంటాయి. యాప్ల పేరుతో జరిగే మోసాలే ఇందులో ఎక్కువగా ఉంటాయి.
సాధారణంగా బ్యాంకులు, ఫైనాన్సియల్ కార్పొరేషన్లు వంటివి అప్పులు ఇస్తుంటాయి. ఇవన్నీ చట్టరీత్యా అప్పు ఇవ్వగలిగేవి. ఏదైనా కంపెనీని ప్రారంభించి చట్టబద్ధంగా అప్పులు ఇవ్వాలంటే... ఆర్బీఐ యాక్ట్లో లేదా చిట్ఫండ్ యాక్ట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చట్టబద్ధంగా అప్పులు ఇచ్చే సంస్థలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటి మాదిరిగానే కనిపించే ఎన్నో ఫేక్యాప్లు పుట్టుకొచ్చాయి. అలాంటి ఫ్రాడ్ యాప్లు దాదాపు అయిదు వందలకు పైగా గూగుల్ ప్లేస్టోర్లో ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
ఇవి ఎక్కువగా యాడ్ బేసిస్ల మీద వస్తున్నాయి అని చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో డబ్బుల అవసరం బాగా ఉన్నవారిని మోసం చేసేందుకు ఇవి పుట్టుకొచ్చాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఏ బ్యాంక్ లేదా కంపెనీ వంటివి ఏడాదికి 36 శాతం కన్నా ఎక్కువ వడ్డీ వసూలు చేయకూడదు. కానీ.. ఈ యాప్ల ద్వారా అప్పులు ఇచ్చే వారు అధిక మొత్తంలో వడ్డీలు తీసుకుంటున్నారు. అంతేకాదు వేధింపులకు పాల్పడుతున్నారు. అప్పు తీసుకున్న వారు మహిళలు అయివుంటే లైంగిక పరమైన వేధింపులూ చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. దిక్కుతోచని స్థితిలో.. అప్పుతీసుకున్నవారు ఆత్మహత్యల దాకా పోతున్నారని పేర్కొంటున్నారు.
ఈ యాప్లు మొదటగా వినియోగదారుడి కాంటాక్ట్ లిస్ట్, ఫోన్లోని ఫొటోలు, వీడియోలకు యాక్సెస్ అడుగుతాయి. యాక్సెస్ ఇచ్చాకే లోన్ తీసుకోగలుగుతారు. అంటే తెలియకుండానే మీకు సంబంధించిన అన్ని విషయాలు వారికి చేరిపోతాయన్నమాట. వాటిని ఆసరాగా చేసుకుని రికవరీల సమయంలో వేధిస్తారు. తీసుకున్న డబ్బు తిరిగి కట్టలేదని పరువు తీసే ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా వేధింపులకు గురిచేయటం చట్ట విరుద్ధం. సాధారణంగా చట్ట రీత్యా అప్పులు ఇచ్చే సంస్థలు ఏవైనా సరే డబ్బును రికవరీ చేసుకోవటంలో కొన్ని నిబంధనలు అనుసరిస్తాయి. కానీ.. ఈ ఫ్రాడ్ యాప్ల ద్వారా అప్పులు ఇచ్చేవారికి అలాంటి వేమీ ఉండవు. దాంతో దారుణాలకు పాల్పడుతున్నారు.
ఈ యాప్లు చైనా బేస్డ్ అనే ప్రచారమూ సాగుతోంది. ఇవి గూగుల్ ప్లేస్టోర్లోకి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు ఇలాంటి వాటిని తొలగిస్తున్నా.. మళ్లీ కొత్త వాటిని సృష్టిస్తున్నారు. చట్టరీత్యా అప్పులు ఇచ్చే సంస్థలు అయిదు పది నిమిషాల్లో అప్పులు ఇవ్వవు వాటికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అందువల్ల అప్పు తీసుకోవటానికి ముందు వినియోగదారుడు అన్ని రకాలుగా సరిచూసుకోవటమే ఉత్తమం. సాధ్యమయినంత వరకు యాప్ల నుంచి ఇచ్చే రుణాలకు దూరంగా ఉండటమే మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం