రాత్రయితే ఆకాశం గులాబీ రంగులోకి..!
సృష్టిలోని అందాలన్నీ ఒకెత్తు.. నెలకోసారొచ్చే పౌర్ణమి ఒకెత్తు.. ఆస్వాదించే మనసు ఉండాలే గానీ.. ప్రతి పున్నమీ ఓ పండగే. అయితే ఆ రెండు పట్టణాల్లో మాత్రం ప్రతిరాత్రి పండు వెన్నెలే.. ప్రతిరోజూ నిండు పౌర్ణమే.. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా..? స్వీడన్లో దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిస్లోవ్, ట్రెల్లెబోర్గ్ అనే రెండు చిన్న పట్టణాల్లో..
ఇంటర్నెట్ డెస్క్: సృష్టిలోని అందాలన్నీ ఒకెత్తు.. నెలకోసారొచ్చే పౌర్ణమి ఒకెత్తు. ఆస్వాదించే మనసు ఉండాలే గానీ.. ప్రతి పున్నమీ ఓ పండగే. అయితే ఆ రెండు పట్టణాల్లో మాత్రం ప్రతిరాత్రి పండు వెన్నెలే.. ప్రతిరోజూ నిండు పౌర్ణమే. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా..? స్వీడన్లోని ఉత్తరప్రాంతంలో ఉన్న గిస్లోవ్, ట్రెల్లెబోర్గ్ అనే రెండు చిన్న పట్టణాల్లో. అక్కడి ప్రజలు కొద్దిరోజులుగా ఈ విచిత్రానుభూతిని ఎదుర్కొంటున్నారు. రాత్రయితే చాలు ఆకాశం గులాబీవర్ణంలోకి మారి అక్కడి వారిని కనువిందు చేస్తోంది. ఇలా ఉన్నట్టుండి ఆకాశంలో ఏర్పడిన మార్పులను చూసి అక్కడి ప్రజలు మొదట్లో భయపడ్డారట. ఇంతకీ ఆకాశం అలా మారడానికి కారణం ఏంటో తెలుసా..? ఓ టమాట తోట. ఆ తోటలో ఏర్పాటు చేసిన ఎనర్జీ సేవింగ్ సిస్టమ్ వల్ల ఆకాశంలో కృత్రిమంగా గులాబీవర్ణం ఏర్పడుతోందని తేలింది. ఆ తోట రైతు టమాట మొక్కలకు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో వాటి కాంతి మేఘాలపై పడటంతో ఇలాంటి మార్పులు వస్తున్నాయని తోట యజమాని చెప్పాడు. ప్రస్తుతం ఆకాశం రంగు మారిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఆ రెండు చిన్న పట్టణ వాసులే కాదు.. ఆ మార్గంలో ప్రయాణించే వారంతా ఈ మార్పులను ఎంతో వింతగా తిలకించారు. తర్వాత అక్కడి ప్రజలు గులాబీ వెలుగు వల్ల తాము కంటినిండా నిద్రపోవడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. అటు పక్షులకూ దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని, గులాబీవర్ణం వల్ల వాటికి కళ్లు కనిపించకగా గందరగోళానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దీనిపై టమాట తోట యజమాని స్పందిస్తూ.. మొక్కలపై గులాబీవర్ణం ప్రసరింపజేస్తే త్వరగా ఎదిగి అధిక దిగుబడి వస్తుందన్నాడు. కేవలం ఎల్ఈడీ లైట్లను ఉపయోగించి విద్యుత్ను ఆదా చేసేందుకే ఇలా చేశానని చెప్పాడు. ప్రజలను ఇబ్బంది పెట్టాలన్నది తన ఉద్దేశం కాదని ఆ రైతు వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్లు
ప్రయాణికుల రద్దీతో 22 రైళ్లకు అదనపు కోచ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటుచేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాల్కు అధికారుల నోటీసులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి చెందిన మాల్కు ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. -
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఏపీ సీఎం జగన్ (YS Jagan) దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..
Indian Student Missing: షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నోటా.. వచ్చిందిలా
ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత. నచ్చని అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం లేకపోవడం వల్ల రకరకాల పద్ధతుల్లో గతంలో తమ వ్యతిరేకతను తెలిపేవారు. -
రైలు తలుపు.. మృత్యు పిలుపు
కాగజ్నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ మధ్య తరచూ రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా రైళ్ల నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై మృతిచెందుతున్నారు. బల్లార్ష-దిల్లీ మధ్య నిత్యం ప్రతి అరగంటకు ఒక ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. -
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును
ఎన్నికల కోడ్ కూసింది మొదలు ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో అగ్రనేతల సమావేశాలు, సభలతో పట్టణాలకే పరిమితమైన ప్రచారం -
ఓట్ల పండగకు ఆహ్వానం
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. -
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల పల్లెలకు చెందిన ఇద్దరు యువకులు ఐఎఫ్ఎస్ సాధించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రన్వేపై పేలిన బోయింగ్ విమానం టైరు..!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM