daggubati: మాజీ మంత్రి దగ్గుబాటికి అస్వస్థత... పరామర్శించిన చంద్రబాబు

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని

Published : 22 Jun 2022 01:09 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఆయన తీవ్ర ఛాతి నొప్పితో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి గుండెపోటు వచ్చినట్టు నిర్ధారించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మనోజ్‌ అగర్వాల్‌ ఆధ్వర్యంలోనై వైద్యుల బృందం దగ్గుబాటికి యాంజియోప్లాస్టి నిర్వహించి రెండు స్టెంట్లు అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడుతున్నట్టు తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం అపోలో ఆసుపత్రికి వెళ్లి దగ్గుబాటిని పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు