KCR: భారాస అధినేత కేసీఆర్‌కు తెలంగాణ మాజీ గవర్నర్‌ నరసింహన్‌ పరామర్శ

భారాస అధినేత కేసీఆర్‌ను తెలంగాణ మాజీ గవర్నర్‌ నరసింహన్‌ పరామర్శించారు. 

Updated : 07 Jan 2024 16:56 IST

హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌ను తెలంగాణ మాజీ గవర్నర్‌ నరసింహన్‌ పరామర్శించారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌కు చేరుకున్న మాజీ గవర్నర్‌ దంపతులు కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమ నివాసానికి వచ్చిన అతిథులకు కేసీఆర్‌ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి సంప్రదాయ పద్ధతిలో మర్యాదలు చేశారు. నరసింహన్‌ దంపతులను తొలుత భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని