ప్రయాణికులు ఆందోళన పడకండి
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారతీయ రైల్వే మార్చి 22 నుంచి 31 వరకు అన్ని రకాల ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. అయితే, అప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ..
దిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారతీయ రైల్వే మార్చి 22 నుంచి 31 వరకు అన్ని రకాల ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. అయితే, అప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ టికెట్ల రద్దు, నగదు వాపస్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైల్వే బోర్డు తాజాగా ప్రకటించింది. మార్చి 21 నుంచి జూన్ 21 మధ్య తేదీల్లో ప్రయాణానికి బుక్ చేసుకున్న టికెట్లను ప్రయాణ తేదీ నుంచి మూడు నెలల కాల వ్యవధిలో ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చని తెలిపింది. ప్రయాణికుల టికెట్ రద్దు, నగదు వాపస్ కోసం ప్రయాణికులెవరూ రైల్వే స్టేషన్కు రావద్దని సూచించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భానుడి వేడి..దొరకని నాడి
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.