దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: ఏపీ డీజీపీ
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్టు వద్ద జరిగిన దాడి ఘటన దురదృష్టకరమని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. దేశమంతటా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అమలులో ఉన్న సమయంలో ఇలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడటం
అమరావతి: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్టు వద్ద జరిగిన దాడి ఘటన దురదృష్టకరమని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. దేశమంతటా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అమలులో ఉన్న సమయంలో ఇలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడటం గర్హనీయమన్నారు. పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.
‘‘ దేశం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో బాధ్యతాయుత పౌరుడిగా వ్యవహరించడం మన కర్తవ్యం. ఈ విషయాన్ని మరిచి దాడులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమో మీరే నిర్ణయించుకోండి. మెడికల్ ఎమర్జెన్సీ ప్రొటోకాల్ ప్రకారం.. తన కోసం, తన కుటుంబ సభ్యుల కోసం, దేశ పౌరుల కోసం స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రాల మధ్య సరిహద్దులు మూసివేశాం. జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాలకు గ్రామాలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాయి. ఈ తరుణంలో అన్ని జిల్లాల సరిహద్దులను ఛేదించుకొని, చట్టాలను ఉల్లంఘించి బైక్లు, కార్లు, బస్సులలో వచ్చి ప్రోటోకాల్ను ధిక్కరించి పొందుగుల సరిహద్దు వద్దకు చొచ్చుకొచ్చారు. అయినా మానవతా దృక్పథంతో రెండు ప్రభుత్వాలు చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రొటోకాల్ ప్రకారం వారి ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలోకి అనుమతించే విధంగా రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా వారికోసం బస్సులు సమకూర్చాం. క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇవేమీ పట్టించుకోకుండా సరిహద్దులు దాటడానికి ప్రయత్నించారు. చీకటిపడిన తర్వాత పోలీసులపైకి మూకుమ్మడి దాడులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇరు ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా హామీ ఇవ్వడం జరిగింది.’’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు.
ఇదీ చదవండి: సరిహద్దుల్లో ఉద్రిక్తత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు