YSRCP: బాలినేని X ఆమంచి
వైకాపా సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సీఎం ఆదేశాల మేరకు అయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు వైకాపా కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ప్రకటన వెలువడింది.
వైకాపా ఎస్ఎన్పాడు పరిశీలకుడిపై వేటు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: వైకాపా సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సీఎం ఆదేశాల మేరకు అయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు వైకాపా కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ప్రకటన వెలువడింది.
సీఎం జగన్ వద్ద పంచాయితీ..!: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన శ్రీనివాసరెడ్డి తొలి నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు. ఆయన భార్య జడ్పీటీసీ సభ్యురాలు. పర్చూరు నియోజకవర్గ బాధ్యుడు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికీ మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. అదే సమయంలో బాలినేనికి భవనం శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో ఆమంచి వైకాపా అధిష్ఠానానికి భవనం తీరుపై ఫిర్యాదులు చేసి సస్పెండ్ చేయించినట్లు ప్రచారం. తన అనుచరుడైన భవనాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని మాజీ మంత్రి బాలినేని తీవ్రంగా పరిగణించారు. జిల్లా పార్టీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు, తనకు కనీస సమాచారం ఇవ్వకుండా తన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సస్పెండ్ చేసిన నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకోవాలంటూ సీఎంను కోరినట్లు ప్రచారం సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. -
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna Sagar Dam) వ్యవహారంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోటాపోటీగా కేసులు నమోదు అవుతున్నాయి. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
KRMB: తెలంగాణ అభ్యర్థన.. జలశక్తి శాఖ కీలక సమావేశం వాయిదా
నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాలు వాటికి అనుబంధంగా ఉన్న ఉమ్మడి నిర్మాణాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించే ప్రక్రియను కేంద్ర జలశక్తి శాఖ ప్రారంభించనుంది. -
Chandrababu: దుర్గమ్మ సేవలో చంద్రబాబు దంపతులు
విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మను తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) దర్శించుకున్నారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Nagarjuna Sagar: సాగర్ ప్రాజెక్టుపైకి సీఆర్పీఎఫ్ బలగాలు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar) పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Whatsapp: వాట్సప్లో యూజర్ నేమ్.. చాట్స్కు సీక్రెట్ కోడ్!
-
Pawan Kalyan: నేను ఏదైనా మాటల్లో చెప్పను.. నిలబడి చూపిస్తా: పవన్ కల్యాణ్
-
Animal: రణ్బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ‘యానిమల్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే!
-
Dhulipalla Narendra: రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు: ధూళిపాళ్ల నరేంద్ర
-
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి
-
Chess: ఒకే ఇంటి నుంచి ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు.. ప్రజ్ఞానంద-వైశాలి అరుదైన ఘనత