వేలిముద్ర వేస్తేనే మొబైల్ సిమ్!
ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందిన టెలికమ్యూనికేషన్ బిల్, 2023కు రాష్ట్రపతి అనుమతి లభించి.. కొత్త చట్టం అమల్లోకి వస్తే.. మొబైల్ కొత్త సిమ్ కార్డు కనెక్షన్ పొందేందుకు బయోమెట్రిక్ ధ్రువీకరణ (వేలిముద్ర వేయడం) తప్పనిసరి అవుతుంది.
ప్రస్తుత వినియోగదార్లకూ వర్తించే వీలు
టెలికాం బిల్లు నేపథ్యం
దిల్లీ: ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందిన టెలికమ్యూనికేషన్ బిల్, 2023కు రాష్ట్రపతి అనుమతి లభించి.. కొత్త చట్టం అమల్లోకి వస్తే.. మొబైల్ కొత్త సిమ్ కార్డు కనెక్షన్ పొందేందుకు బయోమెట్రిక్ ధ్రువీకరణ (వేలిముద్ర వేయడం) తప్పనిసరి అవుతుంది. ఇప్పటివరకు సిమ్ కనెక్షన్ ఇచ్చేందుకు ‘మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) కోసం అత్యధికుల వద్ద ఆధార్ సంఖ్య మాత్రమే తీసుకుంటున్నారు. జియో మాత్రం కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు తొలి నుంచి వేలిముద్ర అవకాశాన్నీ తెచ్చింది. టెలికాం నూతన చట్టం పూర్తిగా అమల్లోకి వస్తే, ప్రస్తుత మొబైల్ వినియోగదార్లు కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవ్వడం తప్పనిసరి అవుతుంది. ఈ బిల్లు ప్రకారం.. ‘టెలికాం సేవలను అందిస్తున్న ఏదైనా అధీకృత సంస్థ తన సేవలను అందించడానికి సిమ్ ఇచ్చే వ్యక్తిని బయోమెట్రిక్ ఆధారంగా గుర్తించాల్సి ఉంటుంది’. నిబంధనలు నోటిఫై అయిన తర్వాతే, బయోమెట్రిక్ తప్పనిసరిపై స్పష్టత రానుంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, 1885, సంబంధిత చట్టాల స్థానంలో కొత్త చట్టం రానుంది. ఇండియన్ వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ 1933, టెలిగ్రాఫ్ వైర్స్(అన్లాఫుల్ పొసెసన్) యాక్ట్-1950లనూ టెలికాం బిల్లు భర్తీ చేయనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
పులివెందుల సీఐ శంకర్రెడ్డి వైకాపా నాయకులతో చేతులు కలిపారని, తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
రెండ్రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను క్యాట్ కొట్టి వేసింది. -
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM