Yadadri temple: రికార్డు స్థాయిలో యాదాద్రీశుడి హుండీ ఆదాయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి నెలరోజుల్లో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది.

Updated : 04 Jan 2024 22:11 IST

యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి నెలరోజుల్లో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. యాదాద్రి పుణ్యక్షేత్రంలోని హుండీల్లో భక్తులు గత 28 రోజులుగా సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకలను గురువారం లెక్కించారు. ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్టు ఈవో రామకృష్ణారావు తెలిపారు. కొండకింద ఆధ్యాత్మిక వాడలోని శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపంలో హుండీ లెక్కింపు చేపట్టారు. మొత్తం నగదు రూ.3,15,05,035, బంగారం 100 గ్రాములు, వెండి 4,250 గ్రాములు హుండీ ద్వారా స్వామివారికి భక్తులు సమర్పించినట్టు ఈవో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు