ఆ ఘనత విజయవాడ విమానాశ్రయానిదే!
కరోనా లాక్డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి చేర్చే ‘వందే భారత్’ మిషన్లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషించిందని ...
విజయవాడ: కరోనా లాక్డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి చేర్చే ‘వందే భారత్’ మిషన్లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషించిందని విమానాశ్రయం డైరెక్టర్ మధుసూదరరావు అన్నారు. మిషన్లోని నాలుగు దశల్లో భాగంగా మే 20వ తేదీ నుంచి బుధవారం(ఆగస్టు 19) వరకు 98 విమానాలు విజయవాడ విమానాశ్రయానికి వచ్చాయని తెలిపారు. ఇవాళ రానున్న రెండు సర్వీసులతో ఆ సంఖ్య 100కు చేరుకుంటుందని వివరించారు.
యూఏఈ, అమెరికా, లండన్, సౌదీ అరేబియా, యూకే, మలేషియా, సింగపూర్, షార్జా, ఖతార్, ఫిలిప్పీన్స్, రాస్ ఆల్ ఖైమా, దుబాయ్, కువైట్ తదితర దేశాల నుంచి ఇప్పటి వరకు 14 వేల మంది ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి తరలివచ్చినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో ఇంతమంది ప్రయాణికులను సురక్షితంగా తమ స్వస్థలాలకు చేర్చిన ఘనత దేశంలోనే విజయవాడ విమానాశ్రయానికి దక్కుతుందని అధికారులు తెలిపారు. వందే భారత్ మిషన్ అంచనాలతో కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో త్వరలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయి అభివృద్ధి సాధిస్తుందని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతుకుజీవుడా..
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
రాములోరికి పసిడి పుష్పార్చన
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.