Tripura Police: ఐ-ప్యాక్ సభ్యులది నిర్బంధం కాదు.. క్వారంటైన్..!
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు చెందిన భారత రాజకీయ కార్యాచరణ కమిటీ(ఐ-ప్యాక్) సభ్యుల్ని గృహ నిర్బంధంలో ఉంచినట్లు వస్తున్న వార్తల్ని త్రిపుర పోలీసులు తోసిపుచ్చారు.
అగర్తల: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు చెందిన భారత రాజకీయ కార్యాచరణ కమిటీ(ఐ-ప్యాక్) సభ్యుల్ని గృహ నిర్బంధంలో ఉంచినట్లు వస్తున్న వార్తల్ని త్రిపుర పోలీసులు తోసిపుచ్చారు. వారిని నిర్బంధించలేదని.. క్వారంటైన్లోనే ఉంచామని పోలీసులు మంగళవారం స్పష్టం చేశారు. 22 మంది ఐ-ప్యాక్ సభ్యులకు సంబంధించి కొవిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాల కోసం వేచి చూస్తున్నట్లు వారు వెల్లడించారు. ఐ-ప్యాక్ సభ్యులను ఆదివారం రాత్రి నుంచి వారు బస చేసిన హోటల్ వుడ్ల్యాండ్ పార్క్లో పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచినట్లు సమాచారం. అయితే గృహ నిర్బంధానికి సంబంధించి ఇప్పటివరకు తనకు ఎలాంటి సమాచారమూ లేదని పశ్చిమ త్రిపుర ఎస్పీ మాణిక్ దాస్ తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 20-22 మంది వ్యక్తులు వుడ్ల్యాండ్ పార్క్ హోటల్లో ఉంటున్నట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. వారి వివరాలపై ఆరా తీసినట్లు పేర్కొన్నారు.
వారం రోజులుగా ఐ-ప్యాక్ సభ్యులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సంచరించడం సహా చాలా మంది వ్యక్తులను కలిసినట్లు తెలిసిందని మాణిక్ దాస్ పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసినట్లు తెలిపారు. తమ నిబంధనల్లో భాగాంగా కొవిడ్ పరీక్ష ఫలితాలు వచ్చేవరకు వారిని ఇక్కడే ఉంచినట్లు వివరించారు. అయితే ఆ ఫలితాలు బుధవారం లేదా గురువారం అందే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఓ పరిశోధన కోసం వారు త్రిపురకు వచ్చినట్లు వెల్లడించారు. అయితే ఆ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కొవిడ్ పరీక్ష ఫలితాలు వచ్చేవరకు వారిని విడుదల చేసేది లేదని తేల్చి చెప్పారు. అయితే ఆ తర్వాత వారిని విడుదల చేయడం.. దర్యాప్తు నివేదికపై ఆధారపడి ఉందన్నారు. త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్కు ఉన్న రాజకీయ అవకాశాలను అధ్యయనం చేసేందుకు వారం రోజులుగా ఐ-ప్యాక్ సభ్యుల బృందం అగర్తలలోని ఓ హోటల్లో బస చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
పులివెందుల సీఐ శంకర్రెడ్డి వైకాపా నాయకులతో చేతులు కలిపారని, తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
రెండ్రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను క్యాట్ కొట్టి వేసింది. -
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం