Viveka Murder Case: ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి.

Updated : 11 Sep 2023 22:09 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును కోర్టు రిజర్వు చేసింది. తన భార్య గర్భవతిగా ఉందని, 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఉదయ్ కుమార్ రెడ్డి కోరారు. తన భార్యను చూసుకోవడానికి ఎవరూ లేరని కోర్టుకు తెలిపారు. సీబీఐ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు వివరించారు. ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి వివేకా హత్య గురించి ముందే తెలుసని.. ఈ మేరకు తన తల్లికి ఈ విషయం చెప్పినట్లు పీపీ కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని