రూ.35కే కిలో ఉల్లిగడ్డలు: నిరంజన్రెడ్డి
ఉల్లిధరలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం వ్యాపారులు నిల్వ చేసే పరిమితులపై ఆంక్షలు విధించింది...
హైదరాబాద్: ఆకాశాన్ని అంటిన ఉల్లిధరలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం వ్యాపారులు నిల్వ చేసే పరిమితులపై ఆంక్షలు విధించింది. రాష్ట్రం ప్రభుత్వం రాయితీపై ఉల్లి సరఫరా చేపట్టింది. జంటనగరాల్లోని 11 రైతుబజార్లలో రూ.35కే కిలో ఉల్లిగడ్డలు సరఫరా చేస్తున్నామని మంత్రి నిరంజన్రెడ్డి ప్రకటించారు. ఉల్లిధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని నిరంజన్రెడ్డి వెల్లడించారు. ప్రతి వ్యక్తికీ 2 కిలోల చొప్పున ఉల్లి విక్రయిస్తామన్నారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి తీసుకోవచ్చని తెలిపారు. భారీ వర్షాలకు దేశ వ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతినగా.. లాభంలేకుండా రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకొని అమ్మకాలు చేపట్టామని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. బహిరంగమార్కెట్లో ఉల్లి రూ.90 పలుకుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతుకుజీవుడా..
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
రాములోరికి పసిడి పుష్పార్చన
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.