లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్.. ఎంతో ఉపయోగం
దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. దాదాపు 37లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అయితే ఇలాంటి సమయంలోనూ రికవరీ రేటు పెరగడం ఊరటనిచ్చే......
రికవరీ రేటు పెరుగుతోందన్న వైద్యులు
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఏర్పాటు
ముంబయి: దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. దాదాపు 37లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అయితే ఇలాంటి సమయంలోనూ రికవరీ రేటు పెరగడం ఊరటనిచ్చే అంశం. దేశ రికవరీ రేటు దాదాపు 77 శాతంగా ఉంది. అలాగే మహారాష్ట్రలో 8 లక్షలకుపైగా కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు 5.80 లక్షల మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. దాదాపు 2లక్షల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో దాదాపు 25వేల మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఏర్పాటు చేసిన లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ వల్ల రికవరీ రేటు పెరిగిందని అధికారులు గుర్తించారు. అలాగే మరణాల రేటు కూడా తగ్గిందని పేర్కొన్నారు.
గత నెల 15న మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే జల్నా జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారు. దీని ద్వారా ఒకేసారి వందమంది బాధితులకు ఒకేసారి ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నారు. కొవిడ్ నివారణలో ఆక్సిజన్ థెరపీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రారంభంలో జిల్లాలో మరణాల రేటు 4.5 శాతంగా ఉండేదని, తర్వాత 2.8 శాతానికి పడిపోయిందన్నారు. అలాగే కరోనా నుంచి కోలుకున్న వారి శాతం 71 శాతానికి చేరిందని వివరించారు. ప్రస్తుతం 238 కరోనా బాధితులకు ఈ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 4,808 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 148 మంది మృతి చెందారు. 3,269 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇదే ఆసుపత్రిలో టెలీ-ఐసీయూ సౌకర్యాన్ని ప్రారంభించారు. ప్రతి బెడ్కు ఏర్పాటు చేసిన మానిటర్ సాయంతో వేరే ప్రదేశం నుంచి కూడా పేషంట్ పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉంది. ముంబయి, దిల్లీకి చెందిన ప్రత్యేక నిపుణుల సలహాలను కూడా తీసుకుంటూ ఉంటామని వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రిలో త్వరలో ప్లాస్మా చికిత్స విధానాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్