TS News: కొవిడ్ సోకిన వారికి అత్యవసర సేవలు నిరాకరించొద్దు: హరీశ్రావు
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల సన్నద్ధత తదితర అంశాలపై మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన గర్భిణులకు
హైదరాబాద్: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల సన్నద్ధత తదితర అంశాలపై మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన గర్భిణులకు అన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని, దీనికి అనుగుణంగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఆపరేషన్ థియేటర్, వార్డును ప్రత్యేకంగా కేటాయించాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలు ఉండి కూడా, అనవసరంగా వారిని ఇతర ప్రభుత్వ పెద్దాసుపత్రులకు రిఫర్ చేయవద్దన్నారు. అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలు అవసరమైన వారికి కొవిడ్ సోకిందని చికిత్స అందించేందుకు నిరాకరించవద్దని, వారికోసం ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, వార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వైద్యాధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని, పరిస్థితులను తెలుసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
కరోనా తగ్గుముఖం పట్టే వరకు బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలు, సబ్ సెంటర్లు ఆదివారం కూడా పని చేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. వ్యాక్సినేషన్, పరీక్షలు, హోమ్ ఐసోలేషన్ కిట్ల పంపిణీ జరగాలన్నారు. కొవిడ్ లక్షణాలతో ఎవరు వచ్చినా పరీక్ష చేసి, లక్షణాలు ఉంటే కిట్ ఇచ్చి పంపాలన్నారు. కేంద్రం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతి పీహెచ్సీలో రాత్రి 10గంటల వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పీహెచ్సీలో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. వ్యాక్సినేషన్లో దేశంలోనే తెలంగాణ నెంబర్వన్గా ఉండాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ రెండు డోసులు ఇవ్వాలని, అందుకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశాఖకార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాసరావుతో కలిసి మంత్రి హరీశ్రావు అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్వోలు, టీచింగ్ ఆసుపత్రి సూపరింటెండెంట్లు, యూపీహెచ్సీ, పీహెచ్సీ వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఒకే కారణంతో రెండుసార్లు సస్పెండ్ చేశారు.. క్యాట్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ
కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై విచారణ జరిగింది. -
అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు.. పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు కాంగ్రెస్ నాయకులు, పార్టీ సోషల్ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/04/24)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం