AP News: కవలలు.. కలిసి సాధించారు!
పదేళ్ల కల.. నాలుగేళ్ల పట్టుదల.. ఎనిమిది నెలల కఠోర శ్రమ.. ఫలితం రూ.50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.
రూ.50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం
పొందిన ఎస్ఆర్ఎం విద్యార్థులు
ఈనాడు, అమరావతి: పదేళ్ల కల.. నాలుగేళ్ల పట్టుదల.. ఎనిమిది నెలల కఠోర శ్రమ.. ఫలితం రూ.50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం మొదటి బ్యాచ్కు చెందిన కవల సోదరులు సాధించిన ఘనత ఇది.
ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్సు విద్యార్థులు సప్తర్షి మజుందర్, రాజర్షి మజుందర్ ఏడాదికి రూ.50లక్షల చొప్పున వేతన ప్యాకేజీతో ఉద్యోగం పొందారు. గూగుల్ జపాన్ భాగస్వామ్య సంస్థ పీవీపీ ఐఎన్సీ నిర్వహించిన మూడు రౌండ్ల పరీక్షల్లో నెగ్గి ఈ ప్యాకేజీని అందుకున్నారు. ఈ కవల సోదరులకు గేమింగ్ డెవలప్మెంట్ అంటే ఎంతో ఆసక్తి. కంప్యూటర్ గేమ్స్లో పరిశోధనలు చేయాలనేది వీరి ఆలోచన. జపాన్ వెళ్లాలనేది చిన్నతనం నుంచి ఉన్న స్వప్నం. దాంతో 8 నెలలపాటు రోజుకు 6 గంటలు కష్టపడి జపనీస్ నేర్చుకున్నారు. జపాన్ వెళ్లాలనే లక్ష్యం కోసం ఇతర కంపెనీల ఉద్యోగాలూ వదులుకున్నారు. కరోనా కారణంగా జపాన్లో గేమ్స్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు తగ్గాయి. ఆ దేశం వెళ్లేందుకు తమ ఇష్టమైన గేమింగ్లో కాకుండా గూగుల్ క్లౌడ్, డేటాబేస్పై పని చేసేందుకు సిద్ధమై.. ఆ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యారు. వీరి కష్టపడేతత్వాన్ని గుర్తించిన కంపెనీ ప్రతినిధులు గూగుల్ క్లౌడ్, డేటాబేస్పై పని చేసేందుకు ఉద్యోగానికి ఎంపిక చేసుకున్నారు. పశ్చిమబెంగాల్కు చెందిన వీరి తండ్రి భిశ్వజిత్ జార్ఖండ్లో ఓ హోటల్లో మేనేజర్గా పని చేస్తున్నారు. ‘ప్రస్తుతం ఉద్యోగంలో చేరినా ఎప్పటికైనా గేమింగ్లో స్టార్టప్ ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం. మొదట లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దాని కోసం చివరి వరకు కష్టపడాలి. అప్పుడే అనుకున్న ఫలితం వస్తుంది’ అని ఈ కవల సోదరులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్లు
ప్రయాణికుల రద్దీతో 22 రైళ్లకు అదనపు కోచ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటుచేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాల్కు అధికారుల నోటీసులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి చెందిన మాల్కు ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. -
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఏపీ సీఎం జగన్ (YS Jagan) దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..
Indian Student Missing: షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నోటా.. వచ్చిందిలా
ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత. నచ్చని అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం లేకపోవడం వల్ల రకరకాల పద్ధతుల్లో గతంలో తమ వ్యతిరేకతను తెలిపేవారు. -
రైలు తలుపు.. మృత్యు పిలుపు
కాగజ్నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ మధ్య తరచూ రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా రైళ్ల నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై మృతిచెందుతున్నారు. బల్లార్ష-దిల్లీ మధ్య నిత్యం ప్రతి అరగంటకు ఒక ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. -
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును
ఎన్నికల కోడ్ కూసింది మొదలు ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో అగ్రనేతల సమావేశాలు, సభలతో పట్టణాలకే పరిమితమైన ప్రచారం -
ఓట్ల పండగకు ఆహ్వానం
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. -
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల పల్లెలకు చెందిన ఇద్దరు యువకులు ఐఎఫ్ఎస్ సాధించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రన్వేపై పేలిన బోయింగ్ విమానం టైరు..!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM