యూజీసీ -నెట్ పరీక్ష తేదీలు విడుదల
యూజీసీ -నెట్ 2021 పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే ఈ పరీక్షలు మే 2 నుంచి జరగనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు......
దిల్లీ: యూజీసీ -నెట్ 2021 పరీక్ష తేదీల షెడ్యూలు విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే ఈ పరీక్ష మే 2 నుంచి జరగనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆయన ట్వీట్ చేశారు. దీంట్లో స్కోరు సాధిస్తే జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలు మే 2,3,4,5,6,7,10,11,12,14 మరియు 17 తేదీల్లో జరుగుతాయని కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ పరీక్ష రాసే అభ్యర్థులందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పారు.
యూజీసీ నెట్ పరీక్ష ఆన్లైన్లో జరగనుంది. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 2 నుంచి (నేటి నుంచి) మార్చి 2వరకు అభ్యర్థులు ugcnet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 3 వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించారు. నెట్ ద్వారా జేఆర్ఎఫ్కి ఎంపికైనవారు స్టైపెండ్తో కూడిన పీహెచ్డీ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. జేఆర్ఎఫ్ అర్హత సాధించినవారికి ప్రతి నెలా స్ట్టైపెండ్, ఏటా కాంటింజెన్సీ గ్రాంటు అందుతాయి.
ఇదీ చదవండి..
కొవిడ్ మహమ్మారికి..160మంది వైద్యులు బలి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి వేడి..దొరకని నాడి
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.