Polavaram: పోలవరానికి పోటెత్తిన వరద

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పోలవరం ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతోంది.

Published : 15 Jul 2023 22:37 IST

పోలవరం: పోలవరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద క్రమంగా అధికమవుతోంది. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటి మట్టం 27.85 మీటర్లకు పెరిగింది. రివర్స్‌ స్లూయిజ్‌ గేట్ల ద్వారా మొన్నటి వరకు బయటకి వచ్చిన వరద ప్రస్తుతం స్పిల్‌వే క్రస్టుగేట్ల ద్వారా వెళ్తోంది. ప్రాజెక్టులోని 48 గేట్ల ద్వారా 1,15,136 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని