Birbhum killings: తృణమూల్‌ నేతను ప్రశ్నించిన సీబీఐ.. 22 మందిపై ఎఫ్‌ఐఆర్‌

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన సజీవ దహనం కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు 22 మంది అనుమానితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో.......

Published : 28 Mar 2022 01:15 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూం జిల్లాలో 8 మంది సజీవ దహనం కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరంగా చేపడుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు 22 మంది అనుమానితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసినట్లు తెలిపింది. రాష్ట్ర పోలీసులు సమర్పించిన జాబితాలోనూ ఇంతమంది పేర్లే ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఇప్పటికే 20 మందిని అరెస్టు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్లాక్ ప్రెసిడెంట్ అనరుల్ హుస్సేన్‌ను సీబీఐ ప్రశ్నించింది. ఈ ఘటనపై మరింత సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ హత్యను దుండగులు ‘ప్రతీకారం’తోనే జరిపినట్లు సీబీఐ శుక్రవారం వెల్లడించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)కి చెందిన బర్షాల్‌ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్‌ భాదు షేక్‌ హత్యకు ప్రతీకారంగానే ఈ హత్యలు జరిగినట్లు పేర్కొంది. వ్యక్తులను చంపాలనే ఉద్దేశంతోనే 70-80 మంది వ్యక్తుల గుంపు.. బాధితులను ఇళ్లలో ఉంచి నిప్పు పెట్టినట్లు సీబీఐ ఎఫ్‌ఆర్‌ నమోదు చేసింది.

మార్చి 21 అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో దుండగులు బోగ్‌టూయిలోని పది ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇద్దరు పిల్లలు సహా 8 మంది బుగ్గిపాలయ్యారు. హత్యకు ముందు బాధితులను కొట్టి అనంతరం సజీవదహనం చేసినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేయగా.. పలువురు పోలీసులను సస్పెండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని