5 prisoners Obama exchanged: ఆ అమెరికా సైనికుడి తప్పే ఈ ‘తాలిబన్ ఫైవ్’..!
అఫ్గానిస్థాన్ ప్రభుత్వంలో తాలిబన్లు అన్ని వర్గాలను చేర్చుకొంటాము అని చెబితే ప్రపంచం నమ్మింది. తీరా ప్రభుత్వం ఏర్పాటు చేశాక చూస్తే.. తాలిబన్ల దృష్టిలో ‘అన్ని వర్గాలు’ అనే దానికి అర్థం వేరని తెలుస్తోంది.
నాడు అధ్యక్షుడు అప్పగించిన ఖైదీలకు కీలక పదవులు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అఫ్గానిస్థాన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలను చేర్చుకుంటాము అని తాలిబన్లు చెబితే ప్రపంచం నమ్మింది. తీరా ప్రభుత్వం ఏర్పాటు చేశాక చూస్తే.. తాలిబన్ల దృష్టిలో ‘అన్ని వర్గాలు’ అనే దానికి అర్థం వేరని తెలుస్తోంది. ఈ ప్రభుత్వంలో ఉగ్రవాదులు, కిడ్నాపర్లు, హత్యలను ప్రోత్సహించిన వారు, భీకరమైన జైళ్లలో ఏళ్లకేళ్లు కాలక్షేపం చేసిన వారందరికి సముచిత స్థానాలు దక్కాయి. వీరిలో ‘తాలిబన్ ఫైవ్’గా పేరున్న ఐదుగురు క్రూరమైన నాయకులకు కీలక పదవులు కట్టబెట్టారు. ఒకప్పుడు అమెరికాను బెదిరించి వీరిని గ్వాంటనామోబే జైలు నుంచి అఫ్గాన్ తెప్పించారు.
ఎవరీ ‘తాలిబన్ ఫైవ్’ బ్యాచ్..!
తాలిబన్ కొత్త ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అబ్దుల్ హక్ వాసిక్, బోర్డర్ అండ్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ నూరుల్లా నూర్, డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ మహమ్మద్ ఫాజీ, సాంస్కృతిక సమాచార మంత్రి ఖైరుల్లా ఖైరాహ్తోపాటు తూర్పు కొహెస్త్ ప్రావిన్స్ గవర్నర్గా నియమితులైన మహమ్మద్ నబీ ఒమర్ను కలిపి ‘తాలిబన్ ఫైవ్’గా పిలుస్తారు. వాసిక్, ఫాజీ, ఖైరాహ్ గతంలో కూడా తాలిబన్ ప్రభుత్వంలో పనిచేశారు.
వీరి క్రూరత్వాన్ని చెప్పిన గ్వాంటనామోబే నివేదిక
గ్వాంటనామోబే జైలు అధికారులు 2008లో వీరి నేరచరిత్రను విశ్లేషిస్తూ పై అధికారులకు నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత వికీలీక్స్ దీనిని బహిర్గతం చేసింది.
* తాలిబన్ల తొలిపాలనలో డిప్యూటి ఇంటెలిజెన్స్ చీఫ్గా వాసిక్ పనిచేశారు. అప్పట్లో తన ఆఫీస్ను అల్ఖైదాకు సహకరించేందుకు వినియోగించారు. దీంతోపాటు తాలిబన్లను ప్రత్యర్థుల నుంచి తప్పించేందుకు, ఇతర ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులను సమన్వయం చేసుకోవడానికి పనిచేశాడు. దీంతోపాటు అమెరికా-నాటో దాడులు మొదలుపెట్టిన తొలినాళ్లలో వాటిపై దాడులు చేయించాడు.
* ఇక ఫాజి అల్ఖైదా, ఇతర ఉగ్రవాదుల దాడుల్లో భాగస్వామి అయ్యాడు.
* ఉత్తర అఫ్గానిస్థాన్లో గవర్నర్గా ఉన్న నూర్ ‘మజారే ఈ షరీఫ్’ పట్టణంలోని హజారా, తజక్, ఉజ్బెక్ జాతుల వారిని విచక్షణారహితంగా హత్యలు చేయించాడు. దీనికి ఫాజి సహకరించాడు.
* తాలిబన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఖైరుల్లా ఒకరు.1999-2001 వరకు పశ్చిమ హెరాత్ ప్రావిన్స్కు గవర్నర్గా వ్యవహరించారు. నల్లమందు ఈయన కనుసన్నల్లోనే సాగు చేశారు. భారీగా నల్లమందు వ్యాపారం చేసేవాడు. 2001లో అమెరికా దళాలు అఫ్గాన్లో ప్రవేశించాక ఇరాన్తో కలిసి ఖైరుల్లా పనిచేశాడు.
బెర్గ్డాల్ కిడ్నాప్తో గ్వాంటనామోబే జైలు నుంచి విడుదల..
అఫ్గానిస్థాన్లోని పక్తిక ప్రావిన్స్లో 2009 జూన్ 30న అమెరికా సైనికుడు సార్జెంట్ బొవె బెర్గ్డాల్ అదృశ్యమయ్యాడు. అతను అక్కడ విధుల్లో చేరి అప్పటి ఐదు నెలలే అయింది. గతంలో శిక్షణలో ఉన్నప్పుడు కూడా హఠాత్తుగా సైనిక క్యాంపును వదిలి వెళ్లిపోవడం, మళ్లీ కొన్నాళ్లకు రావడం అతనికి మాములే. ఈ సారి అఫ్గాన్లో అలానే చేసి హక్కానీ గ్రూప్కు దొరికాడు. అతని కిడ్నాప్ విషయం తెలుసుకొని అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏ పరిస్థితుల్లో అతను హక్కానీ గ్యాంగ్కు దొరికాడో తెలియదు. దీంతో అతన్ని విడిపించేందుకు వాషింగ్టన్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. మరోపక్క దేశంలో అతని తల్లిదండ్రులు ‘స్టాండ్ విత్ బొవి’ పేరిట ఆందోళనలు మొదలుపెట్టారు. 2012లో అమెరికా అధికారులు కతర్లో తాలిబన్ నేతలను రహస్యంగా ముఖాముఖీ కలుసుకొన్నారు. ఆ సమయంలో ఖైదీల అప్పగింత ఒప్పందం ముందుకొచ్చింది. 2014లో కతర్లోని దోహాలో తాలిబన్లు కార్యాలయం తెరిచారు. ఐదుగురు తాలిబన్ నేతలను విడుదల చేస్తే బెర్గ్డాల్ను అప్పగించేందుకు అంగీకారం కుదిరింది. తాలిబన్ నేతల విడుదల విషయంపై అమెరికా కాంగ్రెస్కు 30 రోజుల ముందు తెలియజేయాలి. కానీ, ఒబామా సర్కారు హడావుడిలో ఈ నిబంధనను కూడా పాటించలేదు.
హాలీవుడ్ సినిమాను తలపించేలా..
2014 మే 31వ తేదీన బెర్గ్డాల్ను తాలిబన్ సభ్యులు వదిలేశారు. ఆ అప్పగింత వీడియో హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉంది. పాక్ సరిహద్దుల్లోని కొహిస్త్ ప్రాంతంలో చిత్రీకరించిన ఈ వీడియోలో గాల్లో యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం కనిపిస్తుంది. కొన్ని డజన్ల మంది అమెరికా కమాండోలు 18 మంది తాలిబన్లను కలుసుకొన్నారు. అక్కడే ఆపి ఉన్న పికప్ ట్రక్లోని బెర్గ్డాల్ను తీసుకొని హెలికాప్టర్లలో రివ్వున ఎగిరిపోయారు. మరోవైపు ‘తాలిబన్ ఫైవ్’ బ్యాచ్ కతర్కు చేరుకొంది.
తర్వాత న్యాయస్థానాలు బెర్గ్డాల్పై విచారణ జరిపి దోషిగా నిర్ధారించి శిక్షలు విధించాయి. బెర్గ్డాల్ ఘటన తర్వాత ఒబామాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్.. బెర్గడాల్ను ద్రోహిగా అభివర్ణించారు.
ఇప్పుడు వారిలో నలుగురు అఫ్గాన్ తాత్కాలిక ప్రభుత్వంలో కీలక సభ్యులు అయ్యారు. ఐదో వ్యక్తి ఓ ప్రాంతానికి గవర్నర్గా పాలన సాగిస్తున్నాడు. యుద్ధక్షేత్రాల్లో విధినిర్వహణలో చిన్న అలసత్వం కూడా వ్యూహాత్మకంగా భారీ మూల్యం చెల్లించడానికి కారణమవుతుందనడానికి బెర్గ్డాల్ ఘటనే ఉదాహరణ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?