సినీనటి, ఎంపీ నవనీత్‌ కౌర్‌కు కరోనా 

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు కొవిడ్‌ బారిన పడగా.. తాజాగా మహారాష్ట్రలోని అమరావతి.......

Updated : 06 Aug 2020 21:07 IST

ముంబయి: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు కొవిడ్‌ బారిన పడగా.. తాజాగా మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్‌ కౌర్‌ ఈ జాబితాలో చేరారు. ఆమెకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని నవనీత్‌ కౌర్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘‘నా కుమార్తె, కుమారుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులకూ వైరస్‌ సోకింది. ఓ తల్లిగా వారిని జాగ్రత్తగా చూసుకోవడం నా తొలి కర్తవ్యం. వారిని జాగ్రత్తగా చూసుకొనే క్రమంలో నాకూ వైరస్‌ సోకింది’’ అని పేర్కొన్నారు. 

అభిమానుల ఆశీస్సులతో తామంతా కరోనాను జయిస్తామని నవనీత్‌ కౌర్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు కూడా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమరావతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నవనీత్‌ కౌర్‌ గతంలో అనేక చిత్రాల్లో నటించారు. తెలుగులో శీను వాసంతి లక్ష్మి, శతృవు, జగపతి, రూమ్‌ మేట్స్‌, యమదొంగ, బంగారుకొండ తదితర చిత్రాల్లో నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని