బోయింగ్ లోపాలను దాచింది..!
విమానంలో నిర్మాణాత్మక లోపాలున్నప్పటికీ ఆ విషయాన్ని పైలట్లకూ, విమాన రెగ్యులేటరీ సంస్థలకు బోయింగ్ సంస్థ చెప్పలేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు అమెరికా హౌస్ నియమించిన రావాణా, మౌలికసదుపాయాల కమిటీ ఓ నివేదికను అందజేసింది. ‘‘ చికాగో కేంద్రంగా అభివృద్ధి చేసిన బోయింగ్...
న్యూయార్క్: విమానంలో లోపాలున్నట్లు తెలిసినా ఆ విషయాన్ని పైలట్లకూ, విమాన రెగ్యులేటరీ సంస్థలకు బోయింగ్ సంస్థ చెప్పలేదని అమెరికా ప్రభుత్వ కమిటీ తెలిపింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభకు చెందిన రవాణా, మౌలికసదుపాయాల కమిటీ ఓ నివేదికను అందజేసింది. ‘‘చికాగో కేంద్రంగా అభివృద్ధి చేసిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కూలిపోవడానికి నిర్మాణలోపంతో పాటు సాంకేతిక సమస్యలు, కమ్యూనికేషన్స్ కూడా కారణమయ్యాయి’’ అని కమిటీ సభ్యులు వెల్లడించారు. దీనిని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని తేల్చారు. ఈ మేరకు 245 పేజీల నివేదికను హౌస్ ముందుంచారు.
‘‘బోయింగ్ సంస్థ ఇంజినీర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలో లోపాల వల్లే వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలను బోయింగ్ సంస్థ సరిగా పాటించలేదు’’ అని కమిటీ పేర్కొంది. 2019లో లయన్ ఎయిర్, ఇథియోపియన్ ఎయిర్లైన్స్కు చెందిన రెండు వేర్వేరు విమాన ప్రమాదాల్లో 346 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల కేరళలోని కోజీకోడ్ విమానాశ్రయంలో ‘ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం’ అనూహ్యంగా అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విమానం కూడా బోయింగ్ 737 రకానికి చెందినదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్