మా నాన్నను విడిపించండి.. సీజేఐకి లేఖ
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రదీప్ జైన్ కుమారుడు గౌరవ్ జైన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డేకు లేఖ రాశారు. యూపీ పోలీసులు తన తండ్రిని ఝాన్సీలోని తమ నివాసంలో ఈ నెల 25 నుంచి అక్రమంగా నిర్బంధించారని...........
అధికారులకు ఆదేశాలివ్వాలని కోరిన కాంగ్రెస్ నేత కొడుకు
దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రదీప్ జైన్ కుమారుడు గౌరవ్ జైన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డేకు లేఖ రాశారు. యూపీ పోలీసులు తన తండ్రిని ఝాన్సీలోని తమ నివాసంలో ఈ నెల 25 నుంచి అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. అసలు నిర్బంధించడానికి కారణాలేమిటో కూడా చెప్పడం లేదన్నారు. జిల్లా పాలనా యంత్రాంగం, వారి రాజకీయ సంబంధాల నేపథ్యంలో తన తండ్రిని లక్ష్యంగా చేసుకున్నారన్న అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. తక్షణమే విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సీజేఐకి విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి నిర్బంధం పూర్తిగా అక్రమం, చట్టవిరుద్ధమని.. పోలీసుల ఏకపక్ష చర్యలు తన తండ్రి ప్రాథమిక హక్కును ఉల్లంఘించాయన్నారు. అప్రకటిత ఎమర్జెన్సీని తలపించే ఈ పరిస్థితి చాలా దురదృష్టకరమన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి అక్రమ నిర్బంధాన్ని నిలిపివేసేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు.
మరోవైపు, ప్రదీప్ జైన్ ఆదిత్యతో పాటు అనేకమంది కాంగ్రెస్ పార్టీ నేతలను ఇళ్లల్లోనే పోలీసులు నిర్బంధించినట్టు కాంగ్రెస్ ఆరోపించింది. బుందేల్ఖండ్ ప్రాంతంలోని పలు జిల్లాల్లో గోశాలల దుర్వినియోగాన్ని ఎత్తి చూపేందుకు ‘గోవులను రక్షించండి.. రైతులను పరిరక్షించండి’ పేరుతో ర్యాలీకి ప్రణాళిక రచించినట్టు నేతలు తెలిపారు. ఈ నెల 26 నుంచి 31 వరకు లలిత్పూర్ నుంచి చిత్రకూట్ వరకు తలపెట్టిన తమ మార్చ్ను అడ్డుకొనేందుకే అక్రమ నిర్బంధం విధించారన్నారు. అయితే, శాంతికి విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో నేతలను ముందస్తుగా అరెస్టు చేసినట్టు చెప్పారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
-
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
-
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
-
జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ