భారత్లో 700దాటిన కరోనా మరణాలు!
భారత్లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1684 పాజిటివ్ కేసులు నమోదవడంతోపాటు 37మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,393కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
దిల్లీ: భారత్లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1684 పాజిటివ్ కేసులు నమోదవడంతోపాటు 37మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,077కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వైరస్ సోకి ఇప్పటివరకు 718మంది మృత్యువాతపడ్డారు. మొత్తం బాధితుల్లో 4749మంది కోలుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 17,610మంది చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి కోలుకుంటున్నవారి శాతం 19.89గా ఉందని ప్రభుత్వం తెలిపింది. గతకొన్ని రోజులుగా ఈ వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం ఊరటనిస్తోంది.
మహారాష్ట్రలో విలయతాండవం..
మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 778పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6427కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 283 ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా దేశఆర్థిక రాజధాని ముంబయిలో దీని తీవ్రత అధికంగా ఉంది. గురువారంనాడు నగరంలో 522 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ముంబయిలోనే కరోనా బాధితుల సంఖ్య 4025 చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు నగరంలో కరోనాబారినపడి 167మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ధారవిలో ఆందోళనకరం..
ముంబయి మురికివాడ ధారవిలో కరోనా తీవ్రత కలవరపెడుతోంది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 214పాజిటివ్ కేసులు నమోదుకాగా 13మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికే దీన్ని కేంద్రప్రభుత్వం హాట్స్పాట్గా ప్రకటించింది. దీంతో బృహన్ ముంబయి కార్పొరేషన్ ఇప్పటివరకు 813 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా తాజాగా కేంద్ర ఆరోగ్య బృందాలు మహారాష్ట్రలో పర్యటించి పరిస్థితి సమీక్షించాయి. లాక్డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలుచేయడంతోపాటు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక అధికారులకు సూచనలు ఇచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య రెట్టింపునకు 7రోజులు పడుతున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు.
ఇక గుజరాత్లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక్కడ ఈ వైరస్ బారినపడి 112మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 2624కి చేరింది. దిల్లీలోనూ కరోనా వైరస్తో మొత్తం 50మంది మరణించగా బాధితుల సంఖ్య 2376గా ఉంది. మధ్యప్రదేశ్లోనూ కరోనాతో మరణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు ఇక్కడ కరోనాతో 83మంది మరణించారు. రాజస్థాన్లో ఇప్పటివరకు 1964 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. గడచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 80మంది కరోనా బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 895కి చేరింది. ఆంధ్రప్రదేశ్లో కరోనాతో 27మంది మరణించారు. ఇక తెలంగాణలో నిన్న 27కేసులు నిర్ధారణ కాగా మొత్తం కేసుల సంఖ్య 970కి చేరిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వైరస్ బారినపడి 25మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?