అమెరికాలో కరోనా తొలి రీఇన్ఫెక్షన్ కేసు!
అమెరికాలో నెవాడా రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల వయసున్న ఓ యువకుడికి రెండోసారి కరోనా వైరస్ సోకినట్లు ఓ అధ్యయనం పేర్కొంది. దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో ధ్రువీకరించాల్సి ఉంది. రెండోసారి మహమ్మారి బారినపడడంపై కలకలం కొనసాగుతున్న తరుణంలో..........
రెండోసారీ తీవ్ర లక్షణాలు
వాషింగ్టన్: అమెరికాలో నెవాడా రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల వయసున్న ఓ యువకుడికి రెండోసారి కరోనా వైరస్ సోకినట్లు ఓ అధ్యయనం పేర్కొంది. దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో ధ్రువీకరించాల్సి ఉంది. రెండోసారి మహమ్మారి బారినపడడంపై కలకలం కొనసాగుతున్న తరుణంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే హాంకాంగ్లో అధికారికంగా తొలి రీఇన్ఫెక్షన్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఐరోపాలోని పలు దేశాల్లోనూ రెండోసారి వైరస్ సోకినట్లు వార్తలు వినిపించాయి. కానీ, అవేవీ అధికారికంగా నమోదుకాలేదు.
హాంకాంగ్లో ఓ టెకీకి రెండోసారి వైరస్ సోకినప్పటికీ.. లక్షణాలు మాత్రం కనిపించలేదని అధికారులు తెలిపారు. దీంతో రెండోసారి సోకితే పెద్దగా ప్రమాదమేమీ ఉండదన్న అంచనాలు వెలువడ్డాయి. కానీ, అందుకు భిన్నంగా తాజాగా అమెరికాలో నమోదైన కేసులో మొదటిసారి కంటే రెండోసారి తీవ్ర స్థాయిలో లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఏప్రిల్లో తొలిసారి వైరస్ బారినపడ్డ అతడు అదే నెల 27 నాటికి కోలుకున్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. తర్వాత రెండుసార్లు చేసిన నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్ అని తేలింది.
ఒక నెల తర్వాత తిరిగి అనారోగ్యం బారిన పడడంతో వైద్యుల్ని సంప్రదించాడు. ఈసారి జ్వరం, తలనొప్పి, జలుబు, డయేరియా వంటి లక్షణాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. దీంతో మరోసారి కొవిడ్ పరీక్షలు చేయగా.. పాజిటివ్గా తేలింది. దీన్ని సీరియస్గా తీసుకున్న ‘నెవాడా స్టేట్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీ’ పరిశోధకులు అధ్యయనం మొదలుపెట్టారు. రెండోసారి సోకిన వైరస్ జన్యుక్రమం తొలిసారి సోకిన దాని జన్యుక్రమం కంటే భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. అంటే కరోనా వైరస్లోనే మరో రకం ఆ వ్యక్తికి సోకినట్లు అంచనాకు వచ్చారు. కాలం గడుస్తున్న కొద్దీ ఈ మహమ్మారి రూపాంతరం చెందుతుందని ఇప్పటికే పలు ప్రాథమిక అధ్యయనాలు తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకేవ్యక్తికి పలుసార్లు కొవిడ్-19 సోకే ప్రమాదం లేకపోలేదన్న అంచనాకు వచ్చారు. ఈ అధ్యయనాన్ని ఇంకా అధికారికంగా ప్రచురించాల్సి ఉంది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.