Afghanistan: అఫ్గాన్ పరిణామాలపై అరబ్ మిత్రులతో భారత్ చర్చలు
అఫ్గానిస్థాన్లో తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత్.. తాలిబన్ల పాలనతో
త్వరలో దిల్లీకి రానున్న సౌదీ విదేశాంగ మంత్రి
ఈనాడు, దిల్లీ: అఫ్గానిస్థాన్లో తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత్.. తాలిబన్ల పాలనతో తలెత్తే అవకాశమున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. అరబ్ ప్రపంచంలోని మిత్రదేశాలతో ఈ విషయంపై ఎప్పటికప్పుడు చర్చలు జరిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రధానంగా సౌదీ అరేబియా, ఇరాన్, కతర్, యూఏఈలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ త్వరలోనే దిల్లీలో పర్యటించనున్నారు. భారత్లో ఆయన తొలి పర్యటన ఇదే కానుంది. అఫ్గాన్తో సౌదీకి శతాబ్దాలుగా సంబంధాలున్నాయి. తాలిబన్లతో దౌత్య సంబంధాలు పెట్టుకోవడంపై ఆ దేశం ప్రస్తుతం మౌనం పాటిస్తోంది. అయితే సమీప భవిష్యత్తులో అఫ్గాన్ పరిణామాల్లో సౌదీ కీలకంగా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఫైజల్ భారత పర్యటనకు రానుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అఫ్గాన్ గడ్డపై భారత వ్యతిరేక ఉగ్రవాద ముఠాల గురించి ఆయనకు వివరిస్తామని విదేశీ వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు- ఇరాన్ కూడా త్వరలోనే తమ విదేశాంగ మంత్రిని భారత పర్యటనకు పంపనున్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్ పరిణామాలపై కతర్, యూఏఈలతోనూ మన దేశం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.
పాక్ పాత్రను పరిశీలిస్తాం: బ్లింకెన్
వాషింగ్టన్: అఫ్గానిస్థాన్లో గత 20 ఏళ్లలో పాకిస్థాన్ పోషించిన పాత్రను త్వరలో పరిశీలిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఆ దేశంలో పాక్ భవిష్యత్ పాత్రపైనా కన్నేసి ఉంచుతామని చెప్పారు. 9/11 దాడుల తర్వాత అఫ్గాన్లో పాక్ అత్యంత కుట్రపూరితంగా వ్యవహరించిందని.. దాని పాత్రపై దర్యాప్తు జరిపించాలని చట్టసభ్యులు డిమాండ్ చేసిన నేపథ్యంలో బ్లింకెన్ ఈ మేరకు ప్రకటన చేశారు. తాలిబన్లకు పాకిస్థాన్ దీర్ఘకాలం పాటు మద్దతుగా నిలిచిందంటూ కాంగ్రెస్ వేదికగా పలువురు చట్టసభ్యులు సోమవారం ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సంగతి గమనార్హం. నాటోయేతర ప్రధాన మిత్రపక్షంగా ఆ దేశానికి ఉన్న హోదాను పునఃసమీక్షించాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు- అఫ్గాన్లో ఇటీవల తరలింపు చర్యలు గందరగోళ పరిస్థితుల్లో కొనసాగాయంటూ రిపబ్లికన్ నేతలు చేసిన విమర్శలను బ్లింకెన్ తిప్పికొట్టారు. ఆ పరిస్థితులకు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
120 కోట్ల డాలర్ల సహాయం ప్రకటన
ఐరాస, జెనీవా: సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గానిస్థాన్ వాసులకు అండగా నిలిచేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ఆ దేశానికి 120 కోట్ల డాలర్ల మేర సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. అఫ్గాన్లో మానవీయ సంక్షోభం, తాజా పరిస్థితులపై జెనీవా వేదికగా ఐక్యరాజ్య సమితి సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ ఏడాది చివరికల్లా ఆ దేశానికి 60.6 కోట్ల డాలర్ల సహాయం అందించాలని పిలుపునివ్వగా ప్రపంచ దేశాల నుంచి అద్భుత స్పందన లభించింది. మొత్తంగా అఫ్గాన్కు 120 కోట్ల డాలర్ల మేర సహాయం అందించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చిందని ఐరాస మానవీయ వ్యవహారాల విభాగం అండర్ సెక్రటరీ జనరల్ మార్టిన్ గ్రిఫిత్స్ తెలిపారు. వాటిలో దాదాపు 60 కోట్ల డాలర్లు ఈ ఏడాదే అఫ్గాన్కు సమకూరుతాయని చెప్పారు.
తాలిబన్లతో సంబంధాలు కొనసాగించాల్సిందే: గుటెరస్
తాలిబన్లతో తాము సంబంధాలు కొనసాగించనున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. అఫ్గాన్లో సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు అది అత్యవసరమని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ