Pegasus: ‘పెగాసస్’ వల పెద్దదే..
దాదాపు రెండేళ్ల క్రితం భారత్లో వినిపించిన ‘పెగాసస్’ స్పైవేర్ ఇప్పుడు దేశాన్ని మరోసారి కుదేపిస్తోంది. ఈ స్పైవేర్ సాయంతో పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్కు గురైనట్లు తాజాగా సంచలన కథనం వెలువడింది.
మిస్డ్కాల్తోనే ఫోన్లోకి వచ్చి.. నిఘా పెట్టి
ఇంటర్నెట్డెస్క్: దాదాపు రెండేళ్ల క్రితం భారత్లో వినిపించిన ‘పెగాసస్’ స్పైవేర్ ఇప్పుడు దేశాన్ని మరోసారి కుదిపేస్తోంది. ఈ స్పైవేర్ సాయంతో పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్కు గురైనట్లు తాజాగా సంచలన కథనం వెలువడింది. ఇంతకీ ఏంటీ ‘పెగాసస్’..? ఫోన్లను ఎలా హ్యాక్ చేస్తుంది..?చూద్దాం.
నిఘా కోసం.. సైబర్ ఆయుధంగా
ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అనే సంస్థ ‘పెగాసస్’ స్పైవేర్ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్ను ఎన్ఎస్వో పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. క్రిమినల్స్, ఉగ్రవాదులను పట్టుకోవడం కోసం ప్రభుత్వాలు ఈ స్పైవేర్ను ఉపయోగిస్తుంటాయి. నిపుణులు దీన్ని సైబర్ ఆయుధంగా అభివర్ణిస్తుంటారు. 2016లో తొలిసారిగా ఇది వెలుగులోకి వచ్చింది. ఐఫోన్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ స్పైవేర్ సాయంతో హ్యాకింగ్ జరుగుతున్నట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. దీంతో అప్పుడు యాపిల్ సంస్థ ఐఓఎస్ అప్డేట్ వెర్షన్ను విడుదల చేసింది. ఇది జరిగిన ఏడాదికి మరో విషయం వెలుగులోకి వచ్చింది. పెగాసస్కు ఐఫోన్లతో పాటు ఆండ్రాయిడ్ ఫోన్లను హ్యాక్ చేసే సామర్థ్యం ఉందని తేలింది. 2019లో భారత్లో ఈ స్పైవేర్ కలకలం రేపింది. వాట్సాప్ ద్వారా కొన్ని అజ్ఞాత సందేశాలు వచ్చాయని, వాటితో తమ ఫోన్లలోకి పెగాసస్ను జొప్పించారని కొందరు జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. ఇదిలా ఉండగా.. పెగాసస్ స్పైవేర్తో తమ యూజర్ల గోప్యతకు భంగం కలుగుతోందంటూ రెండేళ్ల క్రితం ఫేస్బుక్ సంస్థ ఎన్ఎస్వోపై కేసు కూడా నమోదు చేసింది.
50 దేశాల్లో.. వల
తాజాగా ఈ పెగాసస్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఈ స్పైవేర్తో హ్యాకింగ్కు గురైన వారి డేటాబేస్ ఒకటి లీకైంది. ‘ది పెగాసస్’ పేరుతో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఫ్రాన్స్కు చెందిన ఫోర్బిడెన్ స్టోరీస్ దర్యాప్తు జరిపి ఈ డేటాబేస్ను రూపొందించినట్లు తెలుస్తోంది. దీన్ని ‘ది వైర్’, ‘వాషింగ్టన్ పోస్ట్’ సహా ప్రపంచవ్యాప్తంగా 16 వార్తా సంస్థలతో పంచుకున్నాయి. ఇందులో 50వేలకు పైగా ఫోన్ నంబర్లు ఉండగా.. ఇప్పటివరకు 1000 నంబర్లను గుర్తించారు. దాదాపు 50 దేశాలకు చెందిన వ్యక్తుల ఫోన్ నంబర్లు ఇందులో ఉన్నాయి. పెగాసస్తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 189 మంది జర్నలిస్టులు, 600మందికి పైగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, 65 మంది వ్యాపార ఎగ్జిక్యూటివ్లు, 85 మంది మానవహక్కుల కార్యకర్తలు ఉన్నారు. ఒక్క భారత్లోనే 300మందికి పైగా బాధితులుండగా.. అజర్బైజాన్, బహ్రెయిన్, హంగేరి, మెక్సికో, మొరాకో, సౌదీ అరేబియా తదితర దేశాలకు చెందిన ప్రముఖుల పేర్లు తాజా డేటాబేస్లో ఉన్నాయి.
పెగాసస్తో హ్యాకింగ్ ఎలా..
హ్యాకింగ్ కోసం పెగాసస్ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. ఈ స్పైవేర్ చాలా రహస్యంగా ఫోన్లోకి వస్తుంది. కనీసం అది మన ఫోన్లో ఉన్న విషయం కూడా గుర్తించలేం. సాధారణంగా నకిలీ వెబ్సైట్ లింక్ల ద్వారా హ్యాకర్లు ఈ స్పైవేర్ను పంపిస్తారు. యూజర్లు తమకు తెలియకుండానే ఈ లింక్ను క్లిక్ చేయడంతో పెగాసస్ ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. ఇక వాట్సాప్ లాంటి యాప్ల ద్వారా చేసే వాయిస్ కాల్స్లో ఉండే సెక్యూరిటీ బగ్ల ద్వారా కూడా దీన్ని ఫోన్లలో ఇన్స్టాల్ చేస్తుంటారు. ఒక్కోసారి కేవలం మిస్డ్కాల్తోనే దీన్ని ఫోన్లలోకి జొప్పిస్తుంటారు. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిన తర్వాత కాల్ లాగ్లోకి వెళ్లి మిస్డ్కాల్ను డిలీట్ చేస్తారు. అప్పుడు యూజర్కు మిస్డ్కాల్ వచ్చిన విషయం కూడా తెలియదు.
పెగాసస్ ఏం చేస్తుంది..
ఒకసారి పెగాసస్ ఫోన్లోకి వచ్చిన తర్వాత లక్షిత యూజర్ల చర్యలపై ఇది నిఘా పెడుతుంది. వాట్సాప్ ద్వారా జరిపే ఎన్క్రిప్టెడ్ సందేశాలనూ చదవగలదు. కాల్స్ను ట్రాక్ చేయడం, లొకేషన్ డేటాను తెలుసుకోవడం, యూజర్ మాట్లాడే కాల్స్ను మైక్రోఫోన్ల ద్వారా విని రికార్డ్ చేయడం వంటివి చేస్తుంది. ఇది పూర్తిగా నిఘా టూల్ లాంటిది. అందుకే ప్రభుత్వాలు ఎవరిపైనైనా నిఘా పెట్టాలనుకుంటే ఈ స్పైవేర్ను ఉపయోగిస్తుంటాయి. అంతేగాక ఇది చాలా స్మార్ట్ స్పైవేర్. యూజర్ తనను గుర్తించకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకవేళ 60 రోజులకు పైగా ఈ మాల్వేర్ కమాండ్ కంట్రోల్ సర్వర్తో కమ్యూనికేషన్ చేయలేకపోయినా.. లేదా తప్పుడు డివైజ్లో ఇన్స్టాల్ అయినట్లు తెలిసినా దానంతట అదే నాశనం అవుతుంది.
ఎన్ఎస్వో ఏమంటోంది..
అయితే పెగాసస్తో హ్యాకింగ్ కథనాలు ఎన్ఎస్వో సంస్థ ఖండిస్తోంది. తాము మంచి పని కోసమే ఈ స్పైవేర్ను ప్రభుత్వాలకు విక్రయించామని పేర్కొంది. దీనిపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, ఆధారల్లేకుండా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని దుయ్యబట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?