ఆక్స్ఫర్డ్ టీకా: చిన్నారులపై ప్రయోగాలు నిలిపివేత!
కరోనా వ్యాక్సిన్పై చిన్నారుల్లో జరుగుతోన్న క్లినికల్ ట్రయల్స్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.
తాత్కాలికంగానే అని వెల్లడించిన ఆస్ట్రాజెనెకా
లండన్: కరోనా వ్యాక్సిన్పై చిన్నారులపై జరుగుతోన్న క్లినికల్ ట్రయల్స్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. పలు దేశాల్లో టీకా తీసుకున్న పెద్దవారిలో రక్తం గడ్డ కడుతున్నట్లు ఫిర్యాదులు వస్తోన్న నేపథ్యంలో.. వాటికి సంబంధించి పూర్తి విశ్లేషణ సమాచారం వచ్చే వరకూ చిన్నారులపై ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లలో ఎక్కువగా 18ఏళ్ల వయసు పైబడిన వారిపైనే ప్రయోగాలు చేయడంతో.. ప్రస్తుతం వారికి మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. ఈ సమయంలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు తీసుకొచ్చేందుకు ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా 6నుంచి 17ఏళ్ల వయసుగల 300 మంది చిన్నారుపై క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించింది. ఇప్పటికే కొందరికి వ్యాక్సిన్ డోసు ఇచ్చినట్లు సమాచారం.
ఇదే సమయంలో యూరప్ దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డ కడుతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. ఇలా ఇప్పటివరకు 30మందికి బ్లడ్ క్లాట్ అయినట్లు గుర్తించగా..వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది. దీంతో పలు దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాయి. అయితే, రక్తం గడ్డకట్టడానికి వ్యాక్సిన్ కారణమని చెప్పడానికి ఎలాంటి రుజువులు లభించలేదని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ కోణంలో నిపుణులు సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రక్తం గడ్డకట్టడంపై పూర్తి సమాచారం వచ్చే వరకు చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ నిలిపివేస్తున్నట్లు ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకాలు ప్రకటించాయి.
ఇదిలాఉంటే, బ్రిటన్లో ఇప్పటివరకు కోటి 80లక్షల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. వీరిలో అతికొద్ది మందిలోనే బ్లడ్క్లాట్ వంటి దుష్ప్రభావాలు వెలుగు చూస్తున్నట్లు అక్కడి నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే రక్తం గడ్డకట్టడానికి ఎలాంటి సంబంధం లేదని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాటిపై పూర్తి నివేదిక వచ్చేవరకు ముందుజాగ్రత్త చర్యగా.. చిన్నారుల్లో వ్యాక్సిన్ ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!