Chandrayaan 3 : చందమామ అందిన రోజు.. ఇకపై ‘నేషనల్ స్పేస్ డే’!
జాబిల్లిపై దక్షిణ ధ్రువం వద్ద చంద్రయాన్-3 (Chandrayaan 3) సురక్షితంగా ల్యాండ్ అయిన రోజు ఆగస్టు 23ను కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ స్పేస్ డే’గా (National Space Day) ప్రకటించింది.
దిల్లీ : చంద్రయాన్-3 (Chandrayaan 3) జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని ముద్దాడిన ఆగస్టు 23ను కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ స్పేస్ డే’గా (National Space Day) ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ‘చంద్రయాన్-3 సాధించిన ఘనత పట్ల యావత్ దేశం, కేంద్ర కేబినెట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. మన దేశ శాస్త్రవేత్తలు సాధించిన ఈ చారిత్రక విజాయానికి తగిన గుర్తింపు ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం భావించింది. అందుకే ఆగస్టు 23ను ‘నేషనల్ స్పేస్ డే’ జరుపుకోవడానికి ఆమోదం తెలిపింది. అత్యద్భుతమైన ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలను మంత్రివర్గం అభినందిస్తోందని’ ఆయన పేర్కొన్నారు.
ఆ ఆత్మహత్యలు నన్ను ఎంతగానో కలచివేశాయి: ‘సూపర్ 30’ ఆనంద్ కుమార్
మన శాస్త్రవేత్తలు చేసిన నిరంతర ప్రయోగాల కృషి ఫలితంగానే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించిందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. విజ్ఞానాన్ని శోధించడానికి భారతీయ శాస్త్రవేత్తలు ఎలాంటి అడ్డంకులనైనా అధిగమిస్తారనేదానికి ఇదొక సంకేతమన్నారు. ప్రజ్ఞాన్ రోవర్ నుంచి ఏ సమాచారం అందినా అది అంతరిక్ష అభివృద్ధిలో కొత్త మార్గాల అన్వేషణకు దోహదపడుతుందని చెప్పారు. చంద్రుడి రహస్యాలను, అంతకుమించి లోతైన విషయాలను అవగాహన చేసుకోవడానికి వీలు కలుగుతుందని తెలిపారు. చంద్రయాన్-3 ప్రాజెక్టులో మహిళలు భాగస్వాములు కావడం పట్ల అనురాగ్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ నెల 23న భారత రోదసి చరిత్రలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లి యాత్రల్లో ఇప్పటిదాకా ఏ దేశమూ అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా ఛేదించింది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద చంద్రయాన్-3 వ్యోమనౌకను సురక్షితంగా దించి.. వినువీధిలో భారత పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను ఆనందంతోనూ.. ఒకింత విజయగర్వంతోనూ నింపింది. విక్రమ్ ల్యాండ్ అయిన తర్వాత దాదాపు నాలుగు గంటలకు దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ సాఫీగా బయటికొచ్చింది. అప్పటి నుంచి చంద్రుడి ఉపరితలంపై కీలక పరిశోధనలు సాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.