అలాంటి పోలీసు చిత్రాలు డేంజర్: బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
సింగం(Singham) వంటి పోలీసు చిత్రాలను ఉద్దేశించిన బాంబే హైకోర్టుకు చెందిన జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..?
అ
ముంబయి: న్యాయ ప్రక్రియను పట్టించుకోకుండా సత్వరమైన న్యాయాన్ని అందించే సింగం(Singham) వంటి పోలీసు సినిమాలు ప్రమాదకరమని బాంబే హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్(Justice Gautam Patel of the Bombay High Court ) అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాలు హానికరమైన సందేశాన్ని పంపుతాయని అన్నారు. ఇండియన్ పోలీసు ఫౌండేషన్ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా న్యాయ ప్రక్రియ విషయంలో ప్రజల అసహనాన్ని ప్రశ్నించారు.
‘పోలీసుల్ని రౌడీలు, జవాబు దారీ లేనివారిగా చూపించడం పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల గురించి ఇలాగే చిత్రీకరిస్తున్నారు. కోర్టులు తమ పని తాము చేయడం లేదని ప్రజలు భావించినప్పుడు.. పోలీసుల చర్యలను స్వాగతిస్తున్నారు. అందుకు ఉదారహరణగా.. అత్యాచార కేసుల్లోని నిందితుల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసినప్పుడు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అప్పుడు న్యాయం జరిగిందని వారు భావిస్తారు. కానీ న్యాయం జరిగిందా..?’ అని ప్రశ్నించారు.
పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
‘సింగం చిత్రం క్లైమాక్స్లో మొత్తం పోలీసులందరూ విలన్ పాత్రగా చిత్రీకరించిన రాజకీయ నాయకుడిపై తిరగబడతారు. దాంతో అక్కడ న్యాయం జరిగినట్లు చూపించారు. కానీ అక్కడ న్యాయం జరిగిందా..? ఎందుకింత అసహనం. ఈ ప్రక్రియ నిదానంగా జరుగుతుంది. వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదనే సూత్రమే అందుకు కారణం. షార్ట్కట్స్ వెంటపడితే ఈ న్యాయ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే ఇలాంటి సందేశాలు ఎంత ప్రమాదకరమో ఆలోచించారా..?’ అని అన్నారు.
పోలీసు యంత్రాంగం పనితీరులో సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ వేసిన యూపీ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ప్రకాశ్ సింగ్ ప్రయత్నాన్ని జడ్జి కొనియాడారు. ఆయన సంస్కరణలు సాకారం కావడంలో అవిశ్రాంత పోరాటం చేశారని చెప్పారు. అలాగే మనల్ని మనం సంస్కరించుకుంటే తప్ప చట్టం అమలులో యంత్రాంగాన్ని సంస్కరించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
2011లో రోహిత్శెట్టి దర్శకత్వంలో సింగం సినిమా విడుదలైంది. అందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ ఒక పవర్ఫుల్ పోలీసు అధికారిగా కనిపిస్తారు. ఇది 2010లో వచ్చిన తమిళ చిత్రానికి రీమేక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.