Gurpatwant Singh Pannun: పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun)కు కేంద్రం షాకిచ్చింది. జాతీయ దర్యాప్తు సంస్థ అతడి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది.
దిల్లీ: కెనడా- భారత్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ (Canada India relations)..కెనడాలోని హిందువులకు వార్నింగ్ ఇచ్చిన వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun)కు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పంజాబ్లోని అతడి ఇల్లు, భూమిని జాతీయ దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది.
అమృత్సర్ శివారులోని పన్నూ పూర్వీకుల గ్రామమైన ఖాంకోట్లో ఉన్న దాదాపు ఆరు ఎకరాల భూమిని, చండీగఢ్లోని ఇంటిని దర్యాప్తు సంస్థ(NIA) స్వాధీనం చేసుకుంది. ప్రస్తుత చర్యతో అతడు తన ఆస్తులపై హక్కుల్ని కోల్పోయాడు. ప్రస్తుతం వాటిని ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తారు. 2020లో దర్యాప్తు సంస్థలు అతడి ఆస్తుల్ని అటాచ్ చేశాయి. అతడు వాటిని విక్రయించడానికి వీలులేదని దానర్థం. వివిధ దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోన్న వేర్పాటువాద సంస్థలపై తీసుకుంటోన్న చర్యలకు ప్రస్తుత పరిణామం మరింత బలం చేకూరుస్తోందని ఎన్ఐఏ తన ప్రకటనలో పేర్కొంది.
సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ) అనే వేర్పాటువాద సంస్థను భారత్ 2019లోనే నిషేధించింది. 2007లో ఈ సంస్థను స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్ను కూడా ఒకడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. తాజాగా కెనడాలో జరుగుతోన్న పరిణామాలపై పన్నూ స్పందించాడు. కెనడా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇండో- కెనడియన్ హిందువులు వ్యవహరిస్తున్నారని ఆరోపించిన అతడు.. అటువంటి వారు తిరిగి భారత్ వెళ్లిపోవాలని బెదిరించాడు. పన్నూ బెదిరింపులపై కెనడాలో హిందూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rahul gandhi: చిరిగిన బూట్లు వేసుకున్నా.. వాళ్లంతా సంపన్న నేతలే: రాహుల్
కొందరు నాయకులు తాము సాధారణ జీవితం గడుపుతునట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆ నాయకులు తమ పిల్లల విషయంలో దీన్ని అమలు చేయలేరన్నారు. -
Uttarakhand tunnel: సొరంగం ఆపరేషన్ను లైవ్లో చూసి.. మోదీ భావోద్వేగం
Uttarakhand tunnel: ఉత్తరాఖండ్లో సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు నిన్న రాత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన ప్రధాని మోదీ.. భావోద్వేగానికి గురయ్యారట..! -
సొరంగంలోని బిడ్డకోసం 16 రోజులు నిరీక్షించి.. బయటకొచ్చే కొద్ది గంటల ముందే..!
Uttarkashi tunnel: కన్నబిడ్డ టన్నెల్లో చిక్కుకుపోయాడని తెలుసుకున్న ఆ తండ్రి తీవ్ర ఆందోళన చెందాడు. బిడ్డ రాకకోసం ఎదురుచూసి.. అతడు రావడానికి కొద్ది గంటల ముందే తుదిశ్వాస విడిచాడు. -
Flight: భార్యాభర్తల గొడవతో.. విమానం దారి మళ్లింది..!
లుఫ్తాన్సా విమానం(Plane)లో ఓ జంట అభ్యంతరకరంగా ప్రవర్తించి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది. వారి వల్ల బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం దిల్లీలో దిగాల్సి వచ్చింది. -
Cabinet Meet: డ్వాక్రా మహిళలకు డ్రోన్లు.. మరో ఐదేళ్లు ఉచిత రేషన్: కేబినెట్ కీలక నిర్ణయాలు
Cabinet Meet: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్వాక్రా మహిళలకు డ్రోన్లను ఇచ్చే పథకంతో పాటు.. ఉచిత రేషన్ పొడిగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
Respiratory Infections: చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కలకలం.. భారత్లో 6 రాష్ట్రాలు అలర్ట్..!
Respiratory Infections: చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి నేపథ్యంలో.. ప్రజారోగ్య సంరక్షణ, ఆసుపత్రుల సంసిద్ధతపై తక్షణమే సమీక్ష జరపాలని ఇటీవల భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. -
Uttarakhand Tunnel: ముందే చెప్పా.. ఆ 41 మంది బయటకు వస్తారని..!: ఆర్నాల్డ్ డిక్స్
Uttarakhand Tunnel: ఆస్ట్రేలియా పౌరుడైన ఆర్నాల్డ్ డిక్స్(Arnold Dix).. ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. -
Anand Mahindra: సమష్టి కృషితో ఏదైనా సాధ్యమే.. కార్మికుల రాకపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
దాదాపు 17 రోజులుగా సొరంగంలో చిక్కుపోయిన కార్మికులను సహాయక బృందాలు ఎట్టకేలకు సురక్షింతంగా బయటకు తీసుకువచ్చాయి. దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. -
Uttarakhand Tunnel: తొలుత భయపడ్డాం.. కానీ, నమ్మకాన్ని వీడలేదు: మోదీతో కార్మికుల సంభాషణ
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్లో సొరంగం నుంచి బయటపడిన కూలీలు ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ ప్రభుత్వం తమను కాపాడుతుందనే నమ్మకంతో తాము ధీమాగా ఉన్నామని ప్రధానికి వారు తెలిపారు. -
అడ్డంకులు అధిగమించి.. ఉత్కంఠకు తెరదించి!
ఉత్తరాఖండ్లో చార్ధామ్ మార్గంలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగం పాక్షికంగా కూలిపోవడంతో దాని లోపల చిక్కుకుపోయిన 41 మంది కూలీలు. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్వో, ఐటీబీపీ తదితర బలగాలు. -
ఆ మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించండి
మణిపుర్లోని మార్చురీలలో భద్రపరిచి ఉన్న మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన తొమ్మిది స్థలాల్లో ఎక్కడైనా సరే మృతుల ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఆ క్రతువును నిర్వహించాలని మంగళవారం స్పష్టం చేసింది. -
ఆ పోస్టుకు మరో ఐఏఎస్ అధికారి లేరా?
మరో ఆరు నెలల పాటు దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నరేశ్ కుమార్ను కొనసాగించాలని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేయడంతో సుప్రీంకోర్టు మంగళవారం కీలక ప్రశ్నలను సంధించింది. -
సామాజిక మాధ్యమాల్లోని సమాచారంతో పిల్
సామాజిక మాధ్యమాల నుంచి సేకరించిన సమాచారంతో ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడాన్ని బాంబే హైకోర్టు తప్పుబట్టింది. అలాంటి గణాంకాలతో వాదనలు వినిపించడం సరికాదని హితవు పలికింది. -
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు తెలపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. వివాహ బంధంలో కొనసాగుతున్నా, విడిపోయినా భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు అవకాశం లేదని జస్టిస్ ఎస్.సునీల్దత్ యాదవ్, జస్టిస్ విజయకుమార్ ఏ పాటిల్లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. -
మమ్మల్ని వేరే కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు పంపండి
మణిపుర్లో ఘర్షణల నేపథ్యంలో తమకు దేశంలోని ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వెసులుబాటు కల్పించాలంటూ మణిపుర్ విశ్వవిద్యాలయానికి చెందిన 284 మంది విద్యార్థులు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే.. నివేదిక సమర్పణకు గడువు కోరిన ఏఎస్ఐ
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన గల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జరిపిన శాస్త్రీయ సర్వే నివేదిక సమర్పణకు మరో మూడు వారాల వ్యవధి కావాలని భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) మంగళవారం జిల్లా కోర్టును కోరింది. -
వృత్తలేఖినితో దాడి కేసు జువైనల్ జస్టిస్ బోర్డుకు
మధ్యప్రదేశ్లో ఇందౌర్లో తమ తోటి విద్యార్థిని మరో ముగ్గురు విద్యార్థులు వృత్తలేఖిని (జామెట్రీ కంపాస్)తో పొడిచిన కేసును జువైనల్ జస్టిస్ బోర్డుకు అప్పగించాలని ఇందౌర్ పోలీసులు నిర్ణయించారు. -
మన ఆస్ట్రోశాట్ భేష్!
భారత్ ప్రయోగించిన అంతరిక్ష టెలిస్కోపు ‘ఆస్ట్రోశాట్’ ఒక అద్భుత మైలురాయిని సాధించింది. విశ్వంలో 600కుపైగా గామా కిరణ విస్ఫోటాల (జీఆర్బీ)ను గుర్తించింది. -
ఉగ్ర సంబంధాలున్న సంస్థల నిధులు స్తంభింపజేయండి
ఉగ్రవాదంతో సంబంధాలున్నాయని, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నాయని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పేర్కొన్న సంస్థల ఆస్తులను 24 గంటల్లో స్తంభింపజేయాలని, ఇతర ఆర్థిక ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. -
నౌకాదళానికి సూపర్ ర్యాపిడ్ గన్ వ్యవస్థ
భారత నౌకాదళం కోసం 16 ఆధునిక సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ (ఎస్ఆర్జీఎం), ఇతర సాధనాలను సరఫరా చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీహెచ్ఈఎల్ సంస్థ రూ.2,956 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వికసిత భారత్ సంకల్ప యాత్రలో చురుగ్గా పాల్గొనండి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తన మంత్రివర్గ సహచరులను ప్రధాని మోదీ ఆదేశించారు.


తాజా వార్తలు (Latest News)
-
Gautam adani: అదానీ షేర్లు జూమ్.. కుబేరుల జాబితాలో టాప్-20లోకి అదానీ
-
Animal: ‘యానిమల్’ కోసం రణ్బీర్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే వావ్ అనాల్సిందే!
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Israel-Hamas: 16 రోజులు చీకటి గదిలో బంధించి.. బాలుడిని హింసించిన హమాస్
-
Btech Ravi: తెదేపా నేత బీటెక్ రవికి బెయిల్ మంజూరు
-
కౌన్బనేగా కరోడ్పతి సంచలనం.. రూ.కోటి గెలుచుకున్న 14ఏళ్ల బాలుడు.. ఆ ప్రశ్న ఏంటో తెలుసా?