ట్రంప్ వాడిన ఔషధానికి భారత్లో గ్రీన్సిగ్నల్!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల సమయంలో కరోనా బారిన పడటనంతో ఒక యాంటీబాడీ కాక్టెయిల్ ఔషధాన్ని వాడారు. ఆ తర్వాత ఆయన వేగంగా కోలుకొన్నారు. తాజాగా ఇప్పుడు ఆ ఔషదం భారత్లో అందుబాటులోకి రానుంది. స్విట్జర్లాండ్కు చెందిన ఔషధ తయారీ
త్వరలో అందుబాటులోకి యాంటీబాడీ కాక్టెయిల్
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల సమయంలో కరోనా బారిన పడటంతో ఒక యాంటీబాడీ కాక్టెయిల్ ఔషధాన్ని వాడారు. ఆ తర్వాత ఆయన వేగంగా కోలుకున్నారు. తాజాగా ఇప్పుడు ఆ ఔషధం భారత్లో అందుబాటులోకి రానుంది. స్విట్జర్లాండ్కు చెందిన ఔషధ తయారీ సంస్థ రోచ్కు భారత్లోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతులు లభించాయి. ప్రస్తుతానికి దీన్ని దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. సిప్లా కంపెనీ భారత్లో దీని మార్కెటింగ్, పంపిణీ వ్యవహారాలను చూడనుంది. రెండు రకాల యాంటీబాడీలను అమెరికాకు రీజనరాన్ సంస్థతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తోంది.
యాంటీబాడీ డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి...
ఏదైనా వ్యాధి సోకినప్పుడు దాన్నుంచి రక్షించేందుకు రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే ప్రోటీన్లే యాంటీబాడీలు. టీకా ఇచ్చినప్పుడు లేదా సహజంగా వ్యాధి సోకినప్పుడు యాంటీబాడీలు విడుదల కావడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అదే, తాజా డ్రగ్లో ప్రయోగశాలల్లో లేదా జంతువులపై జరిపిన ప్రయోగాల్లో కరోనా వైరస్పై సమర్థంగా పనిచేసిన యాంటీబాడీలను వినియోగిస్తున్నారు. ఇవి నేరుగా శరీరంలోకి ఎక్కించడం ద్వారా వైరస్పై తక్షణమే ప్రభావం చూపుతాయని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.
ఏమిటీ కాక్టెయిల్..!
కొవిడ్ వైరస్ను ఎదుర్కొనే కాసిరివి మాబ్, ఇమ్డివిమాబ్ను కలిపి ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. అత్యధిక రిస్క్లో ఉన్న తక్కువ నుంచి ఓ మోస్తరు లక్షణాలున్న పేషెంట్లలో దీనిని వినియోగిస్తారు. ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన ఈ రెండు ప్రతినిరోధకాలను మోనోక్లోనల్ యాంటీ బాడీస్ అంటారు. ఇవి మన ఇమ్యూన్ వ్యవస్థను అనుకరిస్తూ హానికారక వైరస్ల పనిపడతాయి. ఇక సార్స్ కోవ్-2లోని స్పైక్ ప్రోటీన్పై పనిచేయడం వీటి ప్రత్యేకత. ఈ ప్రొటీన్ను అడ్డుకొంటే వైరస్ శరీరంలోని ఏసీఈ2 కణాలకు అతుక్కోదు. ఈ రెండు యాంటీబాడీలు కలిసి స్పైక్ ప్రొటీన్లో ఒక ప్రత్యేకమైన భాగంపై పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో వైరస్లో మ్యుటేషన్లు ఏర్పడినా ఇది పనిచేస్తుంది. దీంతో కొత్త మ్యుటేషన్లను సమర్థంగా అడ్డుకొనే అవకాశం ఉంది.
ఎవరికీ.. ఎలా వాడొచ్చు..?
తక్కువ లక్షణాలు ఉన్న వారికీ.. ఓ మోస్తరు లక్షణాలున్న వారికి ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాదు.. ఈ ఔషదాన్ని 12 ఏళ్లు దాటిని వారిపై కూడా వినియోగించవచ్చు. ఒక్కో యాంటీబాడీ 600 ఎంజీ చొప్పున ఔషధ సమ్మేళనాన్ని 1200 ఎంజీ వినియోగించాలి. దీనిని చర్మం కింద ఉండే ఒకరకమైన కండరంలో లేదా నరాలకు ఎక్కించవచ్చు. 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపర్చవచ్చు. అంటే సాధారణ రిఫ్రిజిరేటర్లు సరిపోతాయి. గుండె, కిడ్నీ, డయాబెటిక్ వంటి సమస్యలు ఉన్నవారికి దీనిని వాడితే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
ప్రభావం ఎంత..?
ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన మూడు ప్రయోగాల్లో ఆస్పత్రుల్లో చేరని 4,567 మంది హైరిస్క్ గ్రూప్నకు చెందిన కొవిడ్-19 రోగులపై ప్రయోగించారు. డమ్మీ ఔషధం (ప్లెసిబో) ఇచ్చిన వారితో మోనోక్లోనల్ యాంటీబాడీస్ తీసుకొన్న వారిని పోలిస్తే సానుకూల ఫలితం వచ్చింది. యాంటీబాడీస్ కాక్టెయిల్ తీసుకొన్న వారు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని దాదాపు 70శాతం తగ్గించింది. దీంతోపాటు నాలుగు రోజుల్లో వేగంగా కోలుకొన్నారు.
వ్యాక్సిన్, యాంటీబాడీ డ్రగ్స్ మధ్య తేడా ఏంటి?
యాంటీబాడీ డ్రగ్స్ తక్షణమే వైరస్పై పోరాడతాయి. అదే వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని మేల్కోలిపి వైరస్ను అంతమొందించేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. దీనికి కాస్త సమయం పడుతుంది. అలాగే యాంటీబాడీ డ్రగ్స్ కేవలం వైరస్ సోకిన వారికి చికిత్సగా మాత్రమే వినియోగిస్తారు. అదే వ్యాక్సిన్ను వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఇస్తారు.
ఎక్కడెక్కడ అనుమతులు వచ్చాయి..
ఈ ఔషధానికి అమెరికా, ఐరోపా సంఘంలో వినియోగానికి అత్యవసర అనుమతులు వచ్చాయి. అక్కడ అంగీకారానికి పరిగణనలోకి తీసుకున్న డేటా ఆధారంగానే తాజాగా భారత్లో అనుమతి మంజూరు చేశారు. భారత్లో దీనిని సిప్లా మార్కెటింగ్ చేయనుంది. దిగుమతులు పూర్తి అయ్యాక.. భాగస్వాములతో చర్చించి దీని ధరను నిర్ణయిస్తామని రోచ్ ఎండీ సింప్సన్ ఇమ్మానియేల్ వెల్లడించారు. అతి త్వరలోనే ఇది భారత్లో అందుబాటులోకి వస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?