Covid-19: పెరుగుతున్న కరోనా కేసులు.. పలు రాష్ట్రాల్లో అమల్లోకి నిబంధనలు!
Covid-19: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో జనసమూహాల్లో మాస్కులు ధరించడాన్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి.
దిల్లీ: గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కొవిడ్-19 (Covid-19) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు మళ్లీ కొవిడ్ నిబంధనల్ని అమల్లోకి తీసుకొస్తున్నాయి.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గడిచిన వారంలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మహమ్మారి (Covid-19) నివారణ, వైద్య వసతుల సన్నద్ధతపై ఆరా తీశారు. సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల సన్నద్ధతను పరిశీలించడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కోరారు. తాజాగా పెరుగుతున్న కేసుల నివారణను సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా సహా ఇతర అత్యవసర ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. అలాగే వీటిపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
కొవిడ్ (Covid-19) నాలుగో దశపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మాండవీయ ఓ జాతీయ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్లో వచ్చిన బీఎఫ్.7 ఉత్పరివర్తనమే ఇప్పటి వరకు చివరిదని తెలిపారు. తాజాగా ఎక్స్బీబీ1.16 సబ్ వేరియంట్ ద్వారా కేసులు వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, సబ్వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కాదని తెలిపారు.
రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాథమిక స్థాయి కొవిడ్ (Covid-19) నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.
హరియాణా..
జన సమూహాల్లో ఉన్నప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలని హరియాణా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహమ్మారి వ్యాప్తి నివారణకు ప్రజలు స్వచ్ఛందంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వ మార్గదర్శకాలు అమలయ్యేలా జిల్లా, పంచాయతీ యంత్రాంగాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
కేరళ..
గర్భిణులు, వయసులో పెద్దవారు, జీవనశైలి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మాస్కులు ధరించడాన్ని కేరళ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఇటీవలే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ సంబంధిత మరణాలు 60 ఏళ్లు పైబడినవారు, డయాబెటిస్ వంటి జీవనశైలి సమస్యలతో బాధపడుతున్నవారిలోనే అధికంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని కోరారు.
ఉత్తర్ప్రదేశ్..
విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై విమానాశ్రయాల్లో క్షుణ్నంగా తనిఖీలు జరపాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కొవిడ్ పాజిటివ్గా తేలిన ప్రతి శాంపిల్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని సూచించింది.
* ఇదే తరహాలో దిల్లీ, పుదుచ్చేరిలోనూ జనసమూహాల్లో మాస్కులు ధరించడాన్ని ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. ఆరోగ్య వ్యవస్థల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాయి.
కొత్తగా 5,357 కేసులు..
దేశంలో ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 5,357 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కి పెరిగింది. కొత్తగా మరో 11 మంది మహమ్మారి వల్ల మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 5,30,965కు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్