1,110కి చేరిన కొవిడ్-19 మృతులు
కరోనా వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 1,110కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 94 మంది మృత్యువాతపడ్డారు. వీరంతా హుబెయ్ ప్రావిన్సుకు చెందినవారే కావడం గమనార్హం..........
బీజింగ్: చైనాలో కొవిడ్ -19 వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 1,110కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 94 మంది మృత్యువాతపడ్డారు. వీరంతా హుబెయ్ ప్రావిన్సుకు చెందినవారే కావడం గమనార్హం. మరో 1,638 మందికి కొత్తవారికి వైరస్ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో వైరస్తో బాధపడుతున్న వారి సంఖ్య 44,200కు చేరింది. 99శాతం మంది వైరస్ బాధితులు చైనాలోనే ఉన్నప్పటికీ.. ఇతర దేశాల్లోకి ఇది పాకే ప్రమాదం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో కొవిడ్ వైరస్కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని కోరింది. తద్వారా వైరస్ కట్టడికి జరుగుతున్న పరిశోధనలకు సహకరించాలని తెలిపింది. మరోవైపు వైరస్ కట్టడికి పోరు కొనసాగిస్తున్న చైనా మంగళవారం హుబెయ్ ప్రావిన్సుకు చెందిన ఇద్దరు ఆరోగ్య శాఖ అధికారులను విధుల నుంచి బహిష్కరించింది. వైద్య సేవల్లో అలక్ష్యం ప్రదర్శించిన కారణంగానే వీరిని తొలగించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ వైరస్కు కొవిడ్-19గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. కరోనా(సీవో), వైరస్(వీఐ), వ్యాధి(డీ) అనే పదాలకు సంక్షిప్త రూపంగా ఈ పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఖరారు చేసింది.
జపాన్ నౌకలో మరో 39 మందికి...
మరోవైపు వైరస్ భయంతో జపాన్ యొకొహామా పోర్టులో నిలిపి ఉంచిన విహార నౌకలో మరో 39 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. తాజాగా 53 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 39 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో నౌకలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 174కి చేరింది. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిగతా ప్రయాణికులను క్యాబిన్లకే పరిమితం చేశారు. మాస్కులు ధరించాలని.. బహిరంగ ప్రదేశంలోకి రావొద్దన్న ఆంక్షలు విధించారు. దీంతో దాదాపు వారం రోజులుగా ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫిబ్రవరి 19న వారిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నౌకలో ఉన్న భారతీయులతో అక్కడి భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..