కరోనా ఎఫెక్ట్‌: ప్రధాని బెల్జియం పర్యటన రద్దు

దిల్లీ: ఈనెల బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరగాల్సిన ‘భారత్‌-యురోపియన్‌ యూనియన్‌ సదస్సు’ కరోనా వైరస్‌ విజృంభన కారణంగా వాయిదా పడింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రసెల్స్ పర్యటన రద్దయినట్లు భారత విదేశాంగశాఖ తాజాగా వెల్లడించింది.

Updated : 21 Dec 2022 16:35 IST

దిల్లీ: ఈనెల బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరగాల్సిన ‘భారత్‌-యురోపియన్‌ యూనియన్‌ సదస్సు’ కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రసెల్స్ పర్యటన రద్దయినట్లు భారత విదేశాంగశాఖ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనావైరస్‌ కారణంగా విదేశీ ప్రయాణాలు చేయకూడదని ఇరుదేశాల ఆరోగ్యశాఖ అధికారులు సూచించినట్లు తెలిపింది. అనుకూలమైన మరో తేదీన ఈ సదస్సు నిర్వహించేందుకు ఇరుదేశ అధికారులు నిర్ణయించారని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ వెల్లడించారు. భారత్‌-ఈయూ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని, అందుకే పరస్పర సహకారంతోనే వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రధానమంత్రి హాజరుకావాల్సిన ఈ సదస్సు నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించేందుకు భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జయశంకర్‌ గత నెల బ్రసెల్స్ పర్యటించివచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని