Vaccine: ‘టీకా వంద శాతం రక్షణ ఇవ్వదు’
కొవిడ్-19 నుంచి వ్యాక్సిన్లు 100% రక్షణ కల్పించలేవని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. అయితే తీవ్రతను తగ్గిస్తాయని అన్నారు. అందుకే టీకా వేసుకున్నా మాస్కులు ధరించాలని
దాని తర్వాతా జాగ్రత్తలు పాటించాల్సిందే
నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్ వెల్లడి
ఈనాడు, దిల్లీ: కొవిడ్-19 నుంచి వ్యాక్సిన్లు 100% రక్షణ కల్పించలేవని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. అయితే తీవ్రతను తగ్గిస్తాయని అన్నారు. అందుకే టీకా వేసుకున్నా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు యాంటీబాడీ టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తొలి డోసు ఒక సంస్థది, రెండో డోసు ఇంకో సంస్థది తీసుకున్నా ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల 20 మంది లబ్ధిదారులకు రెండు వేర్వేరు సంస్థలకు చెందిన డోసులిచ్చిన విషయం గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘వేర్వేరు కంపెనీల డోసులు తీసుకున్నా ప్రతికూల ప్రభావాలేమీ ఉండవు. అయితే దీనిపై శాస్త్రీయంగా బలమైన అభిప్రాయానికి రావడానికి మరిన్ని అధ్యయనాలు, ఆధారాలు రావాల్సి ఉంది. ఒకవేళ ఇప్పటికే ఇలా జరిగిపోయినప్పటికీ ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ప్రస్తుత ప్రొటోకాల్స్ ప్రకారం రెండు డోసులూ ఒకే సంస్థవి ఇవ్వాలి. వైద్యసిబ్బంది వాటిని కచ్చితంగా పాటించాలి’’ అన్నారు.
కొందరు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా యాంటీబాడీలు ఏమీ ఉత్పత్తి కావడం లేదంటున్నారన్న ప్రశ్నకు వీకేపాల్ బదులిస్తూ ‘‘వ్యాక్సిన్ తీసుకున్నవారు యాంటీబాడీ పరీక్షలు చేయించుకోనక్కర్లేదు. రోగనిరోధశక్తి కొలవడానికి యాంటీబాడీ టెస్ట్ ఒక కొలమానం మాత్రమే. అదే ఏకైక కొలమానం కాదు. మాధ్యమిక, దీర్ఘకాలంలో సెల్మీడియేటెడ్ రెస్పాన్స్ అన్నది చాలా ముఖ్యం. శరీరంలోకి వైరస్ జొరబడినప్పుడు మొత్తం రోగనిరోధక వ్యవస్థను ఇది అప్రమత్తం చేస్తుంది. ఆ టెస్ట్ చేయించుకోవడం ముఖ్యం. యాంటీబాడీలు కనిపించినా కనిపించకపోయినా వ్యాక్సిన్ తీసుకున్న అందరిలో రోగనిరోధశక్తి పెరుగుతుంది. వ్యక్తులను బట్టి ఇందులో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మొత్తంగా అందరికీ సామాజికంగా, వ్యక్తిగతంగా రక్షణ ఉంటుంది. రెండు డోసులు తీసుకున్నవారికి తర్వాతి కాలంలో బూస్టర్ డోస్ అవసరమైతే అది ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై ప్రస్తుతం పరీక్షలు నడుస్తున్నాయి. దీన్ని ఆరు నెలల తర్వాత ఇవ్వాలా లేదంటే ఇంకా ఆలస్యంగానా? అన్నదానిపై ఇంకా నిర్ణయానికి రాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్