లాయర్ల సమ్మెల నివారణపై ఇంకెంతకాలం చర్చిస్తారు?
రాష్ట్రాల్లో న్యాయవాదులు సమ్మెలకు దిగడాన్ని నివారించే పక్కా ప్రణాళికను రూపొందించడంలో భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) జాప్యం చేస్తుండడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.
బీసీఐ జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి
దిల్లీ: రాష్ట్రాల్లో న్యాయవాదులు సమ్మెలకు దిగడాన్ని నివారించే పక్కా ప్రణాళికను రూపొందించడంలో భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) జాప్యం చేస్తుండడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. లాయర్ల వృత్తిపరమైన మర్యాదలపై నియమాలను బలోపేతం చేయాలని సూచించింది. న్యాయవాదులు సమ్మెలు చేస్తుండడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అతిక్రమణకు గురవుతున్నాయని కామన్కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం మంగళవారం విచారించింది. ‘‘లాయర్ల సమ్మెల్ని నివారించేలా ఏం చర్యలు చేపట్టాలో చెప్పడానికి ఇంకెంతకాలం చర్చలు జరుపుతారు? బార్ కౌన్సిలే ఈ పని చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఈ ప్రక్రియను మీరెప్పుడో తాపీగా చేస్తామంటే మేం అనుమతించబోం’’ అని స్పష్టంచేసింది. పక్కా కార్యాచరణతో రావాలని సూచిస్తూ విచారణను మార్చి 16కి వాయిదా వేసింది.
సుప్రీంలో విచారణకు రాని బిల్కిస్ బానో పిటిషన్
దిల్లీ: గోద్రా అల్లర్ల సమయంలో (2002) గర్భిణిగా ఉన్న తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రాలేదు. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సి.టి.రవికుమార్ల ధర్మాసనం ముందు బిల్కిస్ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. ఈ న్యాయమూర్తులు ఇద్దరూ అనాయాస మరణానికి సంబంధించిన మరో పిటిషను విచారిస్తున్న అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నందున వీలుపడలేదు. కాబట్టి బిల్కిస్ పిటిషను విచారణకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తాజాగా మరో తేదీ కేటాయించనున్నారు.
జన్యుమార్పిడి ఆవాల ముప్పుపైనే మా ఆందోళన
జన్యుమార్పిడి (జీఎం) ఆవాల విషయంలో ఇతర అంశాల కంటే వాటివల్ల ఎదురయ్యే ముప్పుపైనే ప్రధానంగా తమకు ఆందోళన ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. వీటికి పర్యావరణ అనుమతుల్ని కొన్ని షరతులకు లోబడి కేంద్రం ఇవ్వడంపై జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బి.వి.నాగరత్నల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. డీఎంహెచ్-11 రకం జీఎం ఆవాలను ఉపయోగించి కొత్త వంగడాలను అభివృద్ధిపరచడానికి గత ఏడాది అక్టోబరు 25న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని ‘జన్యు ఇంజినీరింగ్ మదింపు సంఘం’ (జీఈఏసీ) అనుమతించింది. ఇలాంటివాటిని పర్యావరణంలోకి విడుదల చేయడం వల్ల తలెత్తే పరిణామాలపై స్వతంత్ర సంస్థలు అన్నికోణాల్లో పరిశీలించి నివేదికలు ఇచ్చేవరకు జీఎం పంటలపై మారటోరియం విధించాలని సుప్రీంకోర్టును కోరుతూ ఉద్యమకర్త అరుణా రోడ్రిగ్స్, ‘జీన్ క్యాంపైన్’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని ధర్మాసనం పరిశీలించింది. అన్ని అంశాలనూ సుదీర్ఘంగా అధ్యయనం చేసిన తర్వాతే కేంద్రం అనుమతులు ఇచ్చిందని ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి తెలిపారు.
జీవన సంకల్పం ప్రక్రియలో మేజిస్ట్రేట్ అనుమతి నిబంధన తొలగింపు
సుదీర్ఘ కాలంగా వైద్య చికిత్స పొందుతూ కోలుకుంటారనే ఆశ కోల్పోయిన వ్యక్తులకు అనాయాస మరణాన్ని ప్రసాదించడంలో కీలకమైన ‘జీవన సంకల్పం’ అమలులో సంక్లిష్టమైన నిబంధనను సుప్రీంకోర్టు తొలగించింది. అటువంటి వ్యక్తులకు ప్రాణాధార వ్యవస్థల నిలిపివేతకు మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను రద్దు చేసింది. అనాయాస మరణంపై సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పులో గౌరవప్రదంగా మరణించడాన్ని కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఇందుకు కొన్ని నిబంధనలను నిర్దేశించింది. చికిత్సకు లొంగని వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు... తమకు వైద్యాన్ని ఎప్పుడు నిలిపివేయాలనే విషయమై ముందస్తుగా రాసుకొన్న ‘జీవన సంకల్పం’(లివింగ్ విల్) నమోదుకు ఆ నిబంధనలు అవరోధంగా మారడంతో పునఃపరిశీలించాలన్న అభ్యర్థనలు వచ్చాయి. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ‘జీవన సంకల్పం’ పత్రంపై సంబంధిత వ్యక్తి...ఇద్దరు సాక్షుల సమక్షంలో స్వచ్ఛందంగా సంతకం చేయాలని, దానిపై నోటరీ లేదా గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలని ధర్మాసనం మంగళవారం పేర్కొంది. 2018లో పేర్కొన్న...జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమక్షంలో ఇద్దరు సాక్షుల సంతకాల ప్రక్రియ స్థానంలో తాజా నిబంధనను చేర్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
జమ్మూ-కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో అయిదుగురు జవాన్లు గాయపడ్డారు. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
మహిళ అపహరణ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. -
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
సందేశ్ఖాలీ ఘటనలు భాజపా ముందస్తు కుట్రేనని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. -
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి భాజపా చేసే విమర్శలను ఆప్(AAP) తిప్పికొట్టింది. తనవారి కోసమే ఆ పార్టీ పని చేస్తుందని దుయ్యబట్టింది. -
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కారు. ఏకంగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటన అధికారులను షాక్కు గురిచేసింది. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
తన కుమారుడు నామినేషన్ వేసిన సందర్భంగా భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) తన బలాన్ని ప్రదర్శించారు. వేల సంఖ్యలో మద్దతుదారులతో భారీ సభను నిర్వహించారు. -
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
Hamida Banu: ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా? అందులో కన్పిస్తున్న వ్యక్తి భారత మహిళా రెజ్లర్ హమీదా బాను. ఇంతకీ ఎవరామే? ఏంటామె ప్రత్యేకత? -
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
ముందు రాయ్బరేలీలో గెలువు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి తాను చేసిన పోస్టుపై గ్యారీ కాస్పరోవ్ (Garry Kasparov) వివరణ ఇచ్చారు. -
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
కేరళలోని కొచ్చిన్లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. -
వీఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. -
దిగుతుండగా కూలిన హెలికాప్టర్
శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. -
దిల్లీ మద్యం విధానం కేసులో మరో అరెస్టు
దిల్లీ మద్యం విధానంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. -
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాలి
మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకొనే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సహనమే వివాహబంధానికి పునాది
పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో... స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. -
కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం
దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘ రాహుల్గాంధీ’ పేరుందని పోటీ వద్దంటే ఎలా?
ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై పిటిషన్ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. -
రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వండి
పార్కులో ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తి.. వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించిన ఘటనలో బాధితుడి కుటుంబసభ్యులకు రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. -
ఛత్తీస్గఢ్లో చెట్టును ఢీకొన్న బీఎస్ఎఫ్ సిబ్బంది బస్సు
ఛత్తీస్గఢ్లో సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 17 మంది సిబ్బంది గాయపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు