సంక్షిప్త వార్తలు(7)
నూతన గోప్యతా విధానాన్ని అంగీకరించని వినియోగదారులకు సైతం పూర్తి స్థాయి సేవలను అందిస్తామని కేంద్రప్రభుత్వానికి స్పష్టం చేసిన నేపథ్యంలో.. అదే విషయాన్ని జనబాహుళ్యంలో విరివిగా ప్రచారం చేయాలని వాట్సప్ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
కేంద్రానికి మీరు చెప్పిన విషయాన్ని ప్రచారం చేయండి
వాట్సప్ను ఆదేశించిన సుప్రీంకోర్టు
దిల్లీ: నూతన గోప్యతా విధానాన్ని అంగీకరించని వినియోగదారులకు సైతం పూర్తి స్థాయి సేవలను అందిస్తామని కేంద్రప్రభుత్వానికి స్పష్టం చేసిన నేపథ్యంలో.. అదే విషయాన్ని జనబాహుళ్యంలో విరివిగా ప్రచారం చేయాలని వాట్సప్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు పర్యాయాల్లో ఐదు జాతీయ పత్రికల్లో ఈ విషయాన్ని ప్రకటనగా ఇవ్వాలని ఆ సంస్థకు సూచించింది. వాట్సప్ నూతన గోప్యతా విధానంపై దాఖలైన ఓ పిటిషన్ను బుధవారం విచారించిన జస్టిస్ కె.ఎమ్. జోసెఫ్ ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ వరకు అదే నిబంధనని పాటిస్తామని కోర్టుకు వాట్సప్ ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కేరళ పాత్రికేయుడు సిద్దీఖి కప్పన్కు బెయిల్?
లఖ్నవూ: కేరళ పాత్రికేయుడు సిద్దీఖి కప్పన్ గురువారం బెయిల్ మీద విడుదలయ్యే అవకాశం ఉంది. ఆయనను విడుదల చేయడానికి ఒక్కొక్కటి లక్ష రూపాయలు విలువైన రెండు పూచీకత్తులను బుధవారం ఆయన తరఫు న్యాయవాది లఖ్నవూ కోర్టుకు సమర్పించారు. 2020లో ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో ఓ దళిత యువతిపై హత్యాచారం ఘటనకు సంబంధించి వార్తా నివేదనకు కప్పన్తో పాటు మరో ముగ్గురు వెళ్తుండగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మరణంపై హింసను ప్రేరేపించడానికే వెళ్తున్నారని పోలీసులు అనుమానించి వారిని అరెస్టు చేశారు. ఆయనకు నిషిద్ధ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలున్నట్లు ఆరోపించారు. సెప్టెంబరులో కప్పన్ బృందానికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ నగదు అక్రమ చలామణి కేసులో ఈడీ కేసు పెట్టడంతో జైలులోనే ఉన్నారు.
కోర్టులో దొంగలు పడ్డారు
పణజీ: గుర్తుతెలియని వ్యక్తులు జిల్లా కోర్టులో చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గోవాలోని పణజీలో జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కోర్టు వెనుక భాగంలోని కిటికీ విరగ్గొట్టి ఓ గదిలో ఉంచిన డబ్బును దొంగిలించారు. ‘‘కోర్టు కాపలాదారు భవనం ముందుభాగంలో ఉండటంతో.. దొంగలు వెనక భాగం నుంచి వచ్చారు. భవనంపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులే ఈ పని చేసి ఉంటారు’’ అని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రవాసీయుల పిల్లల సంరక్షణపై అమెరికాతో ఒప్పందం చేసుకుంటారా?
కేంద్ర ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీం
దిల్లీ: ప్రవాసీయులైన భార్యాభర్తలు విడిపోయిన సందర్భాల్లో వారి పిల్లల సంరక్షణకు సంబంధించి అమెరికాతో పరస్పర ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలను అన్వేషించే అంశంపై కేంద్రం స్పందనను సుప్రీంకోర్టు కోరింది. భారతీయులు పెద్ద సంఖ్యలో అమెరికాలో నివసిస్తున్నందున ఆ తరహా కేసులు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొంది. ఫిబ్రవరి 6 లోపు తగిన స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల శాఖ, హోంశాఖలకు ఇటీవల నోటీసులు జారీచేసింది. ఓ ఎన్నారై జంటకు సంబంధించిన కేసు విచారణకు వచ్చిన సందర్భంగా ఈ మేరకు సూచించింది. అనంతరం ఫిబ్రవరి 6వ తేదీకి విచారణను వాయిదా వేసింది.
భక్త తుకారం భార్యపై వ్యాఖ్యల వివాదం.. క్షమాపణలు చెప్పిన ధీరేంద్ర శాస్త్రి
ఛతర్పుర్: భక్త తుకారం భార్యకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ పండితుడు, మధ్యప్రదేశ్లోని బాగేశ్వర్ ధామ్ ఆలయ ప్రముఖుడు ధీరేంద్ర శాస్త్రి క్షమాపణలు చెప్పారు. తాను అన్న మాటలకు ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే మన్నించాలని కోరారు. భక్త తుకారం భార్య ఆయన్ను రోజూ కొట్టేదని ధీరేంద్ర చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘‘నా కథను చెప్పే క్రమంలో యథాలాపంగా చెప్పిన మాటలవి. తుకారం ఆదర్శనీయమై వ్యక్తి. ఆయన భార్య దృఢ వ్యక్తిత్వం కలిగిన మహిళ’’ అని ధీరేంద్ర శాస్త్రి చెప్పారు.
రోజుకు 72 లక్షల రిటర్నులు
దిల్లీ: పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలను అందించేలా ఆదాయపు పన్ను పోర్టల్ను మెరుగుపర్చినట్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 6.5 కోట్ల మంది ఆదాయపు పన్ను పోర్టల్ ద్వారా రిటర్నులు దాఖలు చేశారు. ఒక రోజులో గరిష్ఠంగా 72 లక్షల రిటర్నులు దాఖలయ్యాయి. 2013-14లో రిటర్నులను ప్రాసెస్ చేయడానికి సగటున 93 రోజుల వరకూ పట్టేది. ఇప్పుడు కేవలం 16 రోజులే పడుతోంది. 45 శాతం వరకూ రిటర్నులను 24 గంటల్లోపే ప్రాసెస్ చేసినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల కోసం ‘నూతన ప్రామాణిక రిటర్నుల ఫారాన్ని’ తీసుకొచ్చే ప్రతిపాదనలూ ఉన్నాయని తెలిపారు.
మద్యం దుకాణాలను గోశాలలుగా మారుస్తా
మధ్యప్రదేశ్లో మహిళలపై దాడులకు మద్యమే కారణం
కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి వ్యాఖ్య
భోపాల్: కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి మధ్యప్రదేశ్లోని సొంత ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రామ నామంతో ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయని..రాష్ట్రంలో మహిళలపై దాడులకు మద్యపానమే కారణమని.. వెంటనే దాన్ని నియంత్రించకపోతే మద్య దుకాణాలను గోశాలగా మారుస్తానంటూ శివరాజ్సింగ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆమె నాలుగు రోజుల ఆలయాల సందర్శన కార్యక్రమం మంగళవారం ముగిసింది. ‘మధుశాల మే గోశాల’ పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ‘‘అక్రమంగా నడుస్తున్న మద్యం దుకాణాల దగ్గర 11 గోవులతో ప్రజలు సిద్ధంగా ఉండండి. రాముడి పేరుతో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ రామ్ రాజ సర్కార్ ఆలయం పక్కనే మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ వల్లే భాజపా గెలుస్తోంది. ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడే విషయాలు బహిర్గతం చేయడం ప్రారంభిస్తాను’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
చిత్ర వార్తలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..