Helicopter crash: హెలికాప్టర్‌ దుర్ఘటన .. మంటల్లో చిక్కుకొని ముగ్గురు కిందకు దూకారు!

సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 14మంది ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటన యావత్‌ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు .....

Updated : 08 Dec 2021 18:43 IST

చెన్నై: సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 14 మంది ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటన యావత్‌ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనను తాను కళ్లారా చూసినట్టు కృష్ణస్వామి అనే వ్యక్తి తెలిపారు. హెలికాప్టర్‌కు మంటలు అంటుకున్నాయని, అందులో మృతదేహాల్ని చూశానని కృష్ణస్వామి చెప్పారు. 

‘‘నాకు మొదట ఓ పెద్ద శబ్దం వినబడింది. ఏం జరిగిందోనని బయటకు వచ్చి చూస్తే హెలికాప్టర్‌ ఓ పెద్ద చెట్టును ఢీకొట్టడం చూశాను. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో కాలుతున్న ముగ్గురు నలుగురు వ్యక్తులు హెలికాప్టర్‌ నుంచి కిందకు దూకడం చూశాను. హెలికాప్టర్‌కు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. చాలా భయం వేసి అక్కడి నుంచి వచ్చేశా. చుట్టపక్కల ఉన్నవారితో కలిసి సాయం చేసేందుకు ప్రయత్నించా. అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చాం’’ అని కృష్ణస్వామి వెల్లడించాడు. 

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని