Pralay : భారత్ ‘రాకెట్ ఫోర్స్’కు రంగం సిద్ధం..!
చైనా(china)కు దీటుగా భారత్ కూడా రాకెట్ ఫోర్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా 120 ప్రళయ్(Pralay) క్షిపణుల కొనుగోలు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనా(china)తో తలపడేందుకు భారత్ మరో కొత్త ఆయుధం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉన్న త్రివిధ దళాలకు తోడు రాకెట్ ఫోర్స్ను తయారు చేసేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం బాలిస్టిక్, క్రూయిజ్, క్వాజీ బాలిస్టిక్ క్షిపణలను అభివృద్ధి చేస్తోంది. రాకెట్ ఫోర్సును ఏర్పాటు చేసే దిశగానే ఈ అడుగులు పడుతున్నట్లు రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. చైనా(china) 1966లోనే ఇటువంటి రాకెట్ ఫోర్సుకు పునాది వేసింది. 2015లో పీఎల్ఏ 2వ ఆర్టిలెరీ ఫోర్స్ పేరు మార్చి రాకెట్ ఫోర్సుగా చేసింది. దీని వద్దే చైనా(china)లో అత్యధిక అణ్వాయుధాలు ఉన్నాయి. మూడేళ్లలో దీని సైజును 33 శాతం పెంచినట్లు వార్తలొస్తున్నాయి. దీని పరిధిలోకి భారత్లోని నగరాలన్నీ వస్తాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక రాకెట్ ఫోర్స్ కలిగిన దేశాల్లో డ్రాగన్ అగ్రభాగాన నిలిచింది. భారత్తో సరిహద్దు వివాదం రేగగానే చైనా(china)కు చెందిన రాకెట్ ఫోర్స్ను వాస్తవాధీన రేఖ వద్ద మోహరించింది. ఈ క్రమంలో భారత్ కూడా ఇటీవల రాకెట్ ఫోర్స్ ఏర్పాటుపై దృష్టి పెట్టింది.
ఏమిటీ రాకెట్ ఫోర్స్..?
భవిష్యత్తులో యుద్ధాలు నేరుగా జరగవు.. దళాలు ముఖాముఖీ తలపడే సమయానికి శత్రువును పూర్తిగా కుంగదీసేస్తారు. ఇలాంటి వ్యూహంలో భాగంగానే ఉక్రెయిన్ పై రష్యా తొలి రోజు క్షిపణుల వర్షం కురిపించి కీలక మౌలిక వసతులను ధ్వంసం చేసింది. క్షిపణులు, డ్రోన్లు, సైబర్ ఆయుధాలే కీలక పాత్ర పోషిస్తాయి. ‘‘భవిష్యత్తు యుద్ధాలు చాలావరకూ ‘కాంటాక్ట్ లెస్’, మానవ రహితంగా జరుగుతాయి. ట్యాంకులు, సైనిక పోరాటాల కంటే సుదూరం నుంచి ప్రయోగించే స్టాండ్ ఆఫ్ ఆయుధాలు, సైబర్ ఆయుధాలు, రహస్య కార్యకలాపాలతో జరుగుతాయి’’ అని సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్కు రాసిన పేపర్లో బ్రిగేడియార్ బిమల్ మోంగా పేర్కొన్నారు.
భారత్ రాకెట్ ఫోర్సుకు సన్నాహాలు..
భారత్ గత కొన్ని నెలలుగా రాకెట్ ఫోర్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. గతేడాది సెప్టెంబర్లో నాటి సీడీఎస్ దివంగత బిపిన్ రావత్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ క్రమంలో భాగంగానే ప్రళయ్(Pralay) క్షిపణిని వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇది 150-500 కిలోమీటర్ల మధ్య లక్ష్యాలను ఛేదించగలదు.
పైగా ఇది క్వాజీ బాలిస్టిక్ విధానంలో ప్రయాణిస్తుంది. అంటే బాలిస్టిక్ క్షిపణి మాదిరిగా వెళ్లినా.. అవసరమైన సమయంలో దిశ మార్చుకోగలదు. దీంతో శత్రు గగనతల రక్షణ వ్యవస్థలు వీటిని గుర్తించలేవు. అంటే వాస్తవాధీన రేఖ సమీపంలో చైనా(china) సైనిక మౌలిక వసతులను ఇది ధ్వంసం చేయగలదు. తాజాగా ఈ క్షిపణి అభివృద్ధిని వేగవంతం చేసింది. ఇటీవలే 24 గంటల వ్యవధిలో రెండు సార్లు దీనిని పరీక్షించింది. తాజాగా 120 క్షిపణుల కొనుగోలు ఆర్డర్కు రక్షణశాఖ క్లియరెన్స్ లభించింది. ఈ క్షిపణిని సబ్మెరైన్ నుంచి ప్రయోగించే కె-సిరీస్ క్షిపణి నుంచి అభివృద్ధి చేశారు.
మరో వైపు భారత్ అణ్వాయుధాలు ప్రయోగించే అగ్ని-5 రేంజిని మరింత పెంచి ప్రయోగించింది. దీనిలో ఇనుము స్థానంలో లోహ సమ్మేళనాలు(అలాయ్) వాడటంతో బరువు తగ్గి దీని రేంజ్ 5,000 నుంచి 7,000 కిలోమీటర్లకు చేరినట్లు రక్షణ రంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీని రేంజిలోకి చైనా (china)ప్రధాన నగరాలు మొత్తం వచ్చాయి. ఈ క్షిపణి పరీక్షకు భారత్ బంగాళాఖాతంలో నోటామ్(నోటిస్ టు ఎయిర్ మన్) జారీ చేయగానే చైనాకు చెందిన నిఘా నౌక యువాన్వాంగ్-5 హిందూ మహా సముద్రంలో ప్రత్యక్షమైంది. ఈ క్షిపణి సామర్థ్యాన్ని అంచనా వేయడానికే ఇది వచ్చింది.
ఈ నేపథ్యంలో అగ్ని-5ను చైనా(china)లోని నగరాలను టార్గెట్ చేయడానికి, అణు దాడులు చేయడానికి వాడే అవకాశం ఉంది. ఇక ప్రళయ్(Pralay) క్షిపణిని సరిహద్దుల్లో మోహరించి.. చైనా(china) రాకెట్ ఫోర్స్ పరికరాలు, ఇతర సైనిక స్థావరాల విధ్వంసానికి వాడొచ్చు. ప్రళయ్(Pralay) క్షిపణులు రోడ్డు మార్గం ద్వారా తరలించే అవకాశం ఉండటంతో వేగంగా మోహరించవచ్చు.
రాకెట్ ఫోర్సు నిర్వహిణ భారత్ భరించగలిగే స్థాయిలో ఉండాలి. అగ్ని వంటి దీర్ఘ శ్రేణి క్షిపణులను భారీ స్థాయిలో ఉపయోగించలేం. ఇక బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి ఉంది. కానీ, ఒక్కో క్షిపణి ఖరీదు రూ.34 కోట్లు ఉంటుంది. భారత్ రాకెట్ ఫోర్సుకు మరింత చౌకగా లభించే క్షిపణులు అవసరం. ఆర్థికంగా ప్రళయ్ (Pralay)క్షిపణి కొంత చౌకగా తయారు కావడం కలిసొచ్చే అంశం.
సరిహద్దు వద్ద సొరంగాలు అందుకేనా..
భారత్ సరిహద్దుల్లో భారీ ఎత్తున వ్యవూహాత్మక సొరంగాలను నిర్మిస్తోంది. ఇవి కేవలం కీలక సమయాల్లో దళాలను వేగంగా తరలించడంతోపాటు పలు వ్యూహాత్మక అవసరాలను పూర్తి చేస్తాయి. వీటిల్లో భూమిపై నుంచి ప్రయోగించే క్షిపణులను భద్రపర్చేందుకు కూడా వీలుంటుంది. చైనా(china) రాకెట్ ఫోర్స్ కూడా సరిహద్దు వద్దే మోహరించింది. ఈ నేపథ్యంలో శత్రువులు మందస్తుగా దాడి చేసి మన క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేయకుండా భూగర్భ నిర్మాణాలు సురక్షితమైనవి. ఈ సొరంగాలు వాటికి కూడా ఉపయోగపడతాయి. చైనా(china) వద్ద కూడా భారీ ఎత్తున భూగర్భ నిర్మాణాలు ఉన్నాయి. అటువంటి నిర్మాణాల సంఖ్యను ఇంకా పెంచుకొంటూ పోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!