India Corona : ఐదున్నర వేల కేసులు.. భారీగా తగ్గిన మరణాలు

దేశంలో కరోనా క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు నిన్నటితో పోల్చితే ఇంకాస్త తగ్గి ఐదున్నర వేలకు

Published : 06 Mar 2022 09:53 IST

దిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు నిన్నటితో పోల్చితే ఇంకాస్త తగ్గి.. ఐదున్నర వేలకు  దిగొచ్చాయి. ఇక మరణాలు కూడా భారీగా తగ్గడం ఊరట కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..

  1. గడిచిన 24 గంటల్లో 9,09,985 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 5,476  కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
  2. నిన్న 158 మరణాలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు రోజు ఈ సంఖ్య 289గా ఉంది. ఇప్పటి వరకూ నమోదైన మరణాల సంఖ్య 5,15,036కి చేరింది.
  3. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. నిన్న 9754 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.23 కోట్లు దాటింది. ఆ రేటు 98.66 శాతానికి పెరిగింది.
  4. ఇక క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 59,442కి తగ్గి.. ఆ రేటు 0.14 శాతానికి క్షీణించింది.
  5. నిన్న  26,19,778 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 178 కోట్లు దాటింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని