India Corona: కట్టడిలో కరోనా.. తగ్గుముఖం పడుతోన్న క్రియాశీల కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉంది. శుక్రవారం 4.86 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,858 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

Published : 14 May 2022 09:53 IST

తాజాగా నమోదైన కేసులెన్నంటే..?

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉంది. శుక్రవారం 4.86 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,858 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 3,355 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. మహమ్మారి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు దిగొస్తున్నాయి. తాజాగా ఆ సంఖ్య 18,096కి తగ్గిపోయింది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉండగా.. క్రియాశీల రేటు 0.04 శాతంగా కొనసాగుతోంది. నిన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 5.24 లక్షల మందికి పైగా మృత్యుఒడికి చేరుకున్నారు. నిన్న 15.04 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 191 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయని శనివారం కేంద్రం వెల్లడించింది. అలాగే విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు బూస్టర్‌ డోసు వ్యవధిలో కేంద్రం వెసులుబాటు కల్పించింది. రెండో డోసు, బూస్టర్‌ డోసు మధ్య అంతరాన్ని 9 నెలల నుంచి 90 రోజులకు కుదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని