Kejriwal: దిల్లీతో ఆగదు.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆర్డినెన్సులు వస్తాయి: కేజ్రీవాల్
దిల్లీ (Delhi) పరిధిలోని గ్రూప్-ఏ అధికారుల అంశంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం నిరంకుశత్వానికి నిదర్శనమని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని పరిధిలో గ్రూప్-ఏ స్థాయి అధికారుల అంశంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కేంద్ర నిరంకుశత్వానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇది కేవలం దిల్లీతో ఆగిపోదని.. భవిష్యత్లో అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆర్డినెన్స్లు తీసుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకురావడం దిల్లీ ప్రజలను తక్కువ చేయడమేనని ఆయన అన్నారు. కేంద్రం తీరు చూస్తుంటే దిల్లీలో ప్రజాస్వామ్యం లేదని అర్థమవుతోందని ఆరోపించారు.
‘‘ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా మద్దతు కోరుతూ దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నా.. దిల్లీ ప్రజలు ఎప్పటికీ ఒంటరివాళ్లు కాదు.. 140 కోట్ల మంది ప్రజల మద్దతు వాళ్లకు ఉంది. కేంద్రం వంచనకు గురైన తొలి రాష్ట్రం దిల్లీ కావొచ్చు. కానీ, చూస్తూ ఊరుకుంటే.. ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాలకు వస్తుంది.’’ అని కేజ్రీవాల్ హెచ్చరించారు. దేశ రాజధానిలో అభివృద్ధి పనులను అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ను కేంద్ర దర్యాప్తు సంస్థలతో అరెస్టు చేయించారని కేజ్రీవాల్ ఆరోపించారు. కానీ అభివృద్ధి పనులను పరుగులు పెట్టించేందుకు తమ దగ్గర సిసోదియా, జైన్ లాంటి వాళ్లు వందల మంది ఉన్నారని, అభివృద్ధి అంటే ఏంటో వాళ్లే చూపిస్తారని చెప్పారు. ‘‘ ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా ఏళ్లు పని చేశారు. కానీ, నేను సీఎం బాధ్యతలు తీసుకొని కేవలం 8 ఏళ్లే అయ్యింది. మా ఇద్దరిలో ప్రజల కోసం ఎవరు ఎక్కువ పని చేశారో మోదీ చెప్పగలరా?’’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
దిల్లీ పరిధిలోని గ్రూప్-ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కోసం కేంద్రం జాతీయ రాజధాని సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి దిల్లీ ముఖ్యమంత్రి ఛైర్మన్గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గతంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పునకు వ్యతిరేకంగా ఉందని దిల్లీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. దిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు పరచాల్సిందేని ముఖ్యమంత్రి కేజ్రీవాల్తోపాటు పలువురు మంత్రులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడా కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య
హసన సెక్స్ కుంభకోణం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. -
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
‘వందే మెట్రో’ (Vande Metro) పేరుతో సమీప నగరాల మధ్య సరికొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
Salman Khan House Firing Case: సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో ఒక నిందితుడు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
హెచ్పీజెడ్ టోకెన్ యాప్ (HPZ Token App) పెట్టుబడి పేరుతో మోసానికి పాల్పడిన కేసులో సీబీఐ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోదాలు చేసింది. -
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
Deepfake videos: లోక్సభ ఎన్నికల సమయంలో డీప్ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. -
దాదాపు 100 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
Bomb threats: దిల్లీ, నోయిడా ప్రాంతాల్లో దాదాపు 100 స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజ్వల్పై నివేదికకు మహిళా కమిషన్ ఆదేశం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. -
1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు: సుప్రీం
‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు.