
Updated : 22 Jan 2022 10:18 IST
Maoist: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దుశ్చర్య.. 12 వాహనాలకు నిప్పు
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో 12 వాహనాలకు నిప్పు పెట్టారు. బాంబ్రాగఢ్ ప్రాంతంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద దోదరాజ్ నుంచి కవండే వరకు రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఆయుధాలతో నిర్మాణ ప్రదేశం వద్దకు వచ్చిన మావోలు రహదారి పనులు చేస్తున్న సిబ్బందిని చితకబాది 9 ట్రాక్టర్లు, రెండు జేసీబీలు, డోజర్లను తగులబెట్టారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే తమ ఉనికికి ప్రమాదమని భావించి మావోయిస్టులు వాహనాలను తగులబెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Tags :