Modi: ఆ చిన్నారిని కలిశాక.. నాలో విశ్వాసం పెరిగింది: మోదీ
గుజరాత్లోని గాంధీనగర్లో ‘డిజిటల్ భారత్’ వారోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ 11 ఏళ్ల దివ్యాంగ చిన్నారితో ముచ్చటించిన ప్రధాని.. ఆ బాలుడ్ని చూసి
గాంధీనగర్: గుజరాత్లోని గాంధీనగర్లో ‘డిజిటల్ భారత్’ వారోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ 11 ఏళ్ల దివ్యాంగ చిన్నారితో ముచ్చటించిన ప్రధాని.. ఆ బాలుడ్ని చూసి ముచ్చటపడిపోయారు. ఆ చిన్నారిని కలిశాక.. ఈ దేశం ఎక్కడా ఆగిపోదని తనలో విశ్వాసం మరింత పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.
డిజిటల్ ఇండియా వారోత్సవాలను ప్రారంభించిన ప్రధాని.. అక్కడ ప్రదర్శనకు ఉంచిన పలు నూతన ఆవిష్కరణలను తిలకించారు. ఈ సందర్భంగా థింకర్బెల్ ల్యాబ్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న 11 ఏళ్ల ప్రథమేశ్ సిన్హాతో ప్రధాని ముచ్చటించారు. ఈ సంస్థ అంధులు బ్రెయిలీ లిపిని సులభంగా నేర్చుకునేందుకు వీలుగా ‘యాన్నీ’ అనే గ్యాడ్జెట్ను తయారు చేసింది. ప్రథమేశ్ ఈ పరికరం గురించి ప్రధానికి వివరించాడు. అతడు చెబుతున్నంతసేపు ఎంతో ఆసక్తిగా విన్న మోదీ.. ‘నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్?’ అంటూ చిన్నారిని అడిగాడు. ‘పుణె నుంచి వచ్చాను’ అని చెప్పగా.. మోదీ చిన్నారి తలనిమిరి అభినందించారు.
అనంతరం మోదీ ప్రసంగిస్తూ ప్రథమేశ్ గురించి ప్రస్తావించారు. ‘‘నేను ఆ బాలుడితో మాట్లాడినప్పుడు అతడు.. ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అంటూ తనను తాను పరిచయం చేసుకున్న తీరు నన్ను అబ్బురపర్చింది. ఇలాంటి వాళ్లను కలిసినప్పుడే.. ఈ దేశం ఎక్కడా ఆగిపోదని, భవిష్యత్తు కలలను సాకారం చేసుకుంటుందని నాలో విశ్వాసం మరింత పెరుగుతుంది’’ అని మోదీ ఆ చిన్నారిని అభినందించారు.
ఈ వీడియోను థింకర్బెల్ ల్యాబ్స్ సోషల్మీడియాలో షేర్ చేస్తూ..‘‘విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మేం ఈ పరికరాన్ని రూపొందించాం. చదువుకోవాలనుకునే చిన్నారులకు వైకల్యం అడ్డు కాకూడదు. ప్రథమేశ్ లాగే.. ఎంతోమంది అంధ చిన్నారులకు యాన్నీ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ గ్యాడ్జెట్ గురించి ప్రథమేశ్ ప్రధానికి వివరించడం మాకు చాలా గర్వంగా ఉంది’’ అని రాసుకొచ్చింది. ఈ వీడియోను భాజపా కూడా తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ఎవరీ ప్రథమేశ్..
పుణెకు చెందిన ప్రథమేశ్ పుట్టుకతోనే అంధుడు. కానీ ఆ లోపాన్ని అధిగమించి తన టాలెంట్తో ఎంతోమంది దృష్టిని ఆకర్షించాడు. గతేడాది తాను ప్రచారకర్తగా ఉన్న థింకర్బెల్ ల్యాబ్స్ తరఫున ప్రముఖ షో షార్క్ ట్యాంక్లో పాల్గొన్నాడు. అక్కడ ‘యాన్నీ’ గ్యాడ్జెట్ గురించి అతడు ఇచ్చిన ప్రజెంటేషన్తో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నాడు. ఈ ప్రొగ్రామ్ చూసిన బోట్ (boAT) లైఫ్స్టైల్ సీఈఓ అమన్ గుప్తా.. ప్రథమేశ్ను తన ఆఫీసును ఆహ్వానించారు. అంతేగాక, ఒకరోజు బోట్ సీఈఓగా పనిచేసే అద్భుత అవకాశమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..