Modi: రండి.. కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం: జి-20 వేదికగా మోదీ పిలుపు
ఇండోనేషియాలోని బాలి వేదికగా జి-20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. వాతావరణ మార్పులు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు సహా పలు అంశాలపై సుదీర్ఘ ప్రసంగం చేశారు.
బాలి: రష్యా దండయాత్రతో అతలాకుతలమైన ఉక్రెయిన్లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు యావత్ ప్రపంచం సమష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జి-20 వేదికగా పిలుపునిచ్చారు. కొవిడ్ మహమ్మారి తర్వాత కొత్త ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత మనందరిపైనా ఉందని ప్రపంచ దేశాధినేతలకు చాటిచెప్పారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా జి-20 సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. వాతావరణ మార్పులు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు సహా పలు అంశాల గురించి ఆయన ప్రస్తావించారు.
ఇప్పుడు మనవంతు వచ్చింది..
‘‘ఉక్రెయిన్లో కాల్పుల విరమణ, దౌత్య మార్గాన్ని తిరిగి తీసుకురావడానికి మనమంతా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. గత శతాబ్దంలో రెండో ప్రపంచ యుద్ధం.. ప్రపంచంలో పెను విధ్వంసం సృష్టించింది. ఆ తర్వాత శాంతిని నెలకొల్పేందుకు అప్పటి ప్రపంచ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మనవంతు వచ్చింది. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు.. ఇప్పుడు ప్రపంచంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల ప్రపంచ సరఫరా గొలుసులు శిథిలావస్థకు చేరుకున్నాయి. అందుకే మనమంతా ఏకమవ్వాలి. కొవిడ్ మహమ్మారి తర్వాత ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాల్సిన బాధ్యత మనందరి భుజాలపై ఉంది. ప్రపంచంలో శాంతి, సామరస్యం, భద్రతను పటిష్టం చేసేందుకు సమష్టి సంకల్పంతో ముందుకెళ్లడం చాలా ముఖ్యం. బుద్ధుడు, గాంధీ మహాత్ముడు నడయాడిన నేలలో వచ్చే ఏడాది జి-20 సదస్సు జరగనుంది. ఆ వేదికగా ప్రపంచ శాంతికి బలమైన సందేశం ఇస్తామని భారత్ విశ్వాసంగా ఉంది’’ అని మోదీ నొక్కిచెప్పారు.
ఇంధన సరఫరాపై ఆంక్షలు వద్దు..
ఈ సందర్భంగా రష్యా చమురు, గ్యాస్ కొనుగోళ్లపై పశ్చిమ దేశాల ఆంక్షల గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ‘‘భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అందువల్ల ప్రపంచ వృద్ధికి భారత ఇంధన భద్రత కూడా అత్యంత ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో ఇంధన సరఫరాపై ఎలాంటి ఆంక్షలు, పరిమితులను మనం ప్రోత్సహించకూడదు. ఎనర్జీ మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకురావాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు. ఇక, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ ఇంధనానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ‘‘2030 నాటికి మా విద్యుత్తులో సగం పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి అవుతుంది. పునరుత్పాదక వనరుల ఇంధన ఉత్పత్తి కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్థిరమైన సాంకేతికను అందించడం, ఆర్థికంగా అండగా ఉండటం ముఖ్యం’’ అని మోదీ తెలిపారు.
నేడు ప్రపంచంలో చాలా చోట్ల ఆహార, ఆర్థిక సంక్షోభాలు ఏర్పడ్డాయని, దీని వల్ల ఎంతో మంది క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మోదీ అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా విఫలమవుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అలాంటి వారికి అండగా నిలబడేందుకు ఈ జి-20 వేదికగా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని మోదీ నొక్కిచెప్పారు.
ఈ సదస్సు ముగింపు వేడుకల్లో ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో భారత్కు జి-20 అధ్యక్ష పగ్గాలను అప్పగించనున్నారు. వచ్చే ఏడాది మన దేశంలో జరగనున్న ఆ కూటమి సదస్సుకు హాజరవ్వాల్సిందిగా సభ్యదేశాల నేతలను మోదీ వ్యక్తిగతంగా ఆహ్వానించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..